సోమాజిగూడా లోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబాల కోసం ఆదివారం నాడు ప్రత్యేకంగా బసవతారకం కాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం కాన్సర్ స్క్రీనింగ్ కాంప్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఓరల్ స్క్రీనింగ్, చెస్ట్ ఎక్స్ రే, మహిళల కోసం పాప్ స్మియర్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మామోగ్రఫీ, ఆల్ట్రాసౌండ్ (మెడ, పొట్ట, పొత్తి కడుపు) పరీక్షలు చేశారు. ఉచిత డాక్టర్ కన్సల్టెషన్స్, అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 150 మంది జర్నలిస్టులు ఈ పరీక్షలను చేయించుకున్నారు. పలువురు సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ తీసుకున్న ఈ ఇనిషియేషన్ కి ధన్యవాదాలు తెలిపారు. చాప కింద నీటిలా బయట పడుతున్న కాన్సర్ ల విషయంలోటెస్టులే కీలకమని, అడగ్గానే ఈ కాంప్ నిర్వహించిన బసవతారకం హాస్పిటల్ డాక్టర్స్, ఇతర సిబ్బందికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రమేష్ వరికుప్పల, వైస్ ప్రెసిడెంట్ అత్తలూరి అరుణ, కోశాధికారి రమేష్ వైట్ల, జాయింట్ సెక్రటరీ చిలుకూరి హరిప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈసీ మెంబెర్లు రచన ముడుంబై, రాజేశ్వరి కళ్యాణం కూడా ఈ క్యాంపులో పాల్గొన్నారు.