Posts

Showing posts with the label #Sportsnewstelangana #Telanganasportsnews

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కోచ్ బ్రిజ్ కిశోర్ కు రూ.25ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం

Image
అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కోచ్ బ్రిజ్ కిశోర్ కు రూ.25ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం ఆస్ట్రేలియా లో జరిగిన 2018 ప్రపంచ కప్ పోటీల్లో కాంస్య పతకంతో పాటు జిమ్నాస్టిక్ లో తన సత్తాను చాటుకొని తెలంగాణా కీర్తిని రెప రెప లాడించిన అరుణా రెడ్డి కోచ్ బ్రిజ్ కిశోర్ ను బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్లో మంత్రి పద్మారావు గారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది.  ఆయన అందించిన సేవలకు గాను ప్రభుత్వం తరుపున ఆయనకు 25 లక్షల రూపాయల చెక్ ను హాస్పిటల్లో మంత్రి పద్మారావు గారు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్పొర్ట్స్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి గారు, సాట్స్ యం.డి. దినకర్ బాబు మరియు మంత్రి ఓ‌ఎస్‌డి రాజేశ్వర్ రావు గారు తదితరులు పాల్గొనడం జరిగింది.