Posts

Showing posts with the label #hyderabadbookfair #telanganachiefsecretary #CSramakrishnarao

అక్షర సేద్యం.. పఠనమే భాగ్యం

Image
  ఉత్తేజంగా ‘బుక్ వాక్’.. ప్రారంభించిన సి.ఎస్. రామకృష్ణారావు ఎన్.టి.ఆర్ స్టేడియంలో సందడిగా 38వ పుస్తక ప్రదర్శన సాంకేతికత పెరిగినా తగ్గని పుస్తక ప్రాధాన్యత తరలివచ్చిన రచయితలు, సాహితీవేత్తలు, విద్యార్థులు హైదరాబాద్:-మారుతున్న ప్రపంచంలో సాంకేతికత ఎన్ని మార్పులు తీసుకొచ్చినప్పటికీ, పుస్తకానికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పేర్కొన్నారు. 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన *‘బుక్ వాక్’*ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బుధ‌వారం లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయం నుండి ఎన్.టి.ఆర్ స్టేడియంలోని అందే శ్రీ ప్రాంగణం (బుక్ ఫెయిర్) వరకు ఈ యాత్ర ఉత్సాహంగా సాగింది.   జ్ఞానానికి వారధి.. పుస్తకం ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ.. పుస్తకాలు అనేవి మనల్ని మరో లోకానికి తీసుకెళ్లే అద్భుతమైన కిటికీల వంటివని అభివర్ణించారు. వ్యక్తిగత వికాసం: ఇతరుల జీవిత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడానికి పఠనం ఒక వారధిలా ఉపయోగపడుతుంద‌న్నారు.   బాహ్య ప్రపంచం వేగంగా మారినా, పుస్తకాల ద్వారా పొందే జ్ఞానం శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్...