Posts

Showing posts with the label telangana police

మహిళల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం

Image
 మహిళల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం ఎన్ హెచ్ ఆర్ సి సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) వివిధ శాఖల అధికారులతో మంగళవారం నాడు సమావేశమైంది.  గౌరవనీయ చైర్‌పర్సన్ శ్రీ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, గౌరవ సభ్యులు శ్రీమతి విజయ భారతి సయానీ, డా.జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, టి ఎస్ హెచ్ ఆర్ సి  గౌరవ చైర్మన్ జస్టిస్ శ్రీ షమీమ్ అక్తర్, సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్), శ్రీ ఆర్ . ప్రసాద్ మీనా, రిజిస్ట్రార్ (లా) డిప్యూటీ శ్రీ జోగిందర్ సింగ్ తదితరులు జాతీయ మానవ హక్కుల కమిషన్  నుండి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మహిళలపై నేరాలు అనే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా డిజిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో  ఉమన్ సేఫ్టీ వింగ్ పనిచేస్తుందన్నారు. వివిధ ప్రాంతాలకు చెందినవారు హైదరాబాద్ లో...

ఖైదీల ఎస్కార్ట్ వ్యవస్థ బలోపేతానికి డీజీపీ కార్యాలయంలో సమీక్ష: సమన్వయానికి కొత్త మార్గదర్శకాలు

Image
 డిజిపి  కార్యాలయంలో ఖైదీల ఎస్కార్ట్ పై గురువారం నాడు ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఖైదీల ఎస్కార్ట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమైన మార్గదర్శకాలను  శాంతి భద్రతల అదనపు డిజిపి  మహేష్ ఎం. భగవత్ జారీ చేశారు. నూరు శాతం  ఖైదీల ఎస్కార్ట్ ను సమర్ధంగా చేసిన  వారిని వ్యక్తిగతంగా అభినందించారు.  ఇతర రాష్ట్రాలతో సమన్వయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఎస్కార్ట్ అభ్యర్థనల కోసం రేడియో సందేశాలు కనీసం ఒక వారం ముందే పంపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది మెరుగైన ప్రణాళికకు దోహదపడుతూ, చివరి నిమిషపు లాజిస్టికల్ సమస్యలను నివారించగలదని అన్నారు. అన్ని సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం, లా అండ్ ఆర్డర్, సి ఏ ఆర్, జైళ్లు, కోర్టు అనుసంధానం విభాగాల అధికారులతో కలిసి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఖైదీల ఎస్స్కార్టు తేదీలు, సమయాలు, ఎస్కార్ట్ ఏర్పాట్లపై తక్షణ సమాచారం మార్పిడి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాలో బయట ఖైదీ ఎస్కార్ట్ శాతం తక్కువగా ఉండే యూనిట్లపట్ల ఆందోళన వ్యక్తం చేసి...