ఏషియన్ పెయింట్స్ 'యాంటీ-డాంప్ టెక్నాలజీ' ఆవిష్కరణ
- వాటర్-మార్క్ సమస్యకు ఇకపై చెక్ - ఎకానమీ విభాగంలో నాలుగేళ్ల వారంటీ కూడా.. తూఫాన్, హైదరాబాద్ :- ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు అందంగా, సౌకర్యవంతంగా, ఏళ్ల తరబడి మన్నికగా ఉండాలని కోరుకుంటారు. అయితే, ఎకానమీ పెయింట్ విభాగంలో (అందుబాటు ధరల్లో ఉండే రంగులు) ఇవన్నీ ఉండే ఉత్పత్తులు చాలా వరకు కష్టమే. వీటన్నింటిలోనూ అత్యంత సాధారణమైన సమస్య గోడలపై వచ్చే నీటి మరకలు (వాటర్ మార్క్స్). ఇది ఇంటి అందాన్ని మెల్లగా దెబ్బతీస్తుంది. దీనిని గుర్తిస్తూ, ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఏషియన్ పెయింట్స్ 'ఏస్', 'ట్రాక్టర్ ఎమల్షన్ల'లో 'యాంటీ-డాంప్ టెక్నాలజీ'ని ఆవిష్కరించింది. అద్భుతమైన పనితీరు, ఆకర్షణీయమైన లుక్తో ఈ ఎకానమీ రేంజ్ ఉత్పత్తులపై నాలుగేళ్ల వారంటీని కూడా ఇస్తుంది. ఏషియన్ పెయింట్స్ అత్యంత నమ్మకమైన, విస్తృతంగా ఉపయోగిస్తున్న బ్రాండ్లలో ఒకటైన 'ఏస్', 'ట్రాక్టర్ ఎమల్షన్లు' ఎకానమీ విభాగంలో నాణ్యతను, విలువను అందించడం ద్వారా ఇంటి యజమానులు, డీలర్లు, కాంట్రాక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. వినియోగదారుల అవసరాలను తీర్చడం కోసం ఈ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో నిరంతరం కొత్త ఆవిష్కరణలను పరిచయం చే...