Posts

Showing posts with the label chiryala lakshmi narasimha swamy

చీర్యాల నారసింహుడి చెంతకు పదండి.. నేటి నుంచే ‘అష్టాదశ’ బ్రహ్మోత్సవాలు!

Image
  చీర్యాల నారసింహుడి చెంతకు పదండి.. నేటి నుంచే  ‘అష్టాదశ’ బ్రహ్మోత్సవాలు!     ఏప్రిల్ 12 నుండి 15 వరకు కనుల పండువగా వేడుకలు..  14న స్వామివారి తిరుకళ్యాణం భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, నిత్య అన్నదానం..  ఆహ్వాన పత్రాలు అందుకున్న ప్రముఖులు కీసర / మేడ్చల్ (తూఫాన్ బ్యూరో):   ఆధ్యాత్మిక పరిమళాలతో కీసర మండలం చీర్యాల గ్రామం పులకించబోతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుండి 15 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ ఫౌండర్, చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ గారు భక్తులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక షెడ్యూల్ ఇదే: ఏప్రిల్ 12 (ఆదివారం): సాయంత్రం 5 గంటలకు చైర్మన్ లక్ష్మీనారాయణ నివాసం నుండి గ్రామమంతా స్వామివారి భవ్య ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభం. ఏప్రిల్ 13 (సోమవారం): పంచామృత అభిషేకం, సుదర్శన నరసింహ యాగం, అఖండ జ్యోతి స్థాపన వంటి విశేష పూజలు. ఏప్రిల్ 14 (మంగళవారం): ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట రిటైర్డ్ ప్రధానార్చక...