Posts

Showing posts with the label #pmmodi #khelmahotsav #vidyasagarrao #bandarudattatreya #kishnareddy #ckrishnayadav

ముగిసిన ఖేల్ మహోత్సవం.. విజేతలకు బహుమతుల ప్రదానం

Image
 - జింఖానాలో క్రీడా సంబరాలు.. హాజరైన విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తూఫాన్,హైదరాబాద్ :- సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన 'పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం' మెగా క్రీడా పండుగ ఆదివారం ఘనంగా ముగిసింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన ముగింపు వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రధాని మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ ఖేల్ మహోత్సవం అద్భుతమైన వేదికగా నిలిచిందని కొనియాడారు. గల్లీ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంలో ఈ పోటీలు ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణకు కూడా తోడ్పడతాయని, క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మెగా స్పోర్ట్స్ ఫెస్ట...