రూ. 450 కోట్ల వ్యయంతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ది హెచ్.ఆర్.డిలో ప్రారంభమైన స్వచ్ఛ ఐకానిక్ జాతీయ సదస్సు దేశంలో ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్లుగా గుర్తించి వాటిని రూ. 450 కోట్ల వ్యయంతో పర్యాటక అనుకూల ప్రాంతాలుగా అభివృద్ది చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్ వాటర్, సానిటేషన్ శాఖ డైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సును జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డితో కలిసి అక్షయ్ రౌత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుండి వచ్చిన సీనియర్ అధికారులు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ క్రింద చేపట్టిన పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అక్షయ్ రౌత్ మాట్లాడుతూ మొత్తం మూడు దశల్లో 30 ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యా...