* నర్సాపూర్ అడవి పునరుజ్జీవనం కోసం ప్రభుత్వ ముమ్మర ప్రయత్నాలు* * సహజ అడవిని కాపాడుతూ , ఎకో టూరిజం కేంద్రాల అభివృద్దికి చర్యలు* ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉండి , తర్వాతి కాలంలో వివిధ కారణాల వల్ల క్షీణించిన ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ అడవికి పూర్వ వైభవం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ సంపదకు , జంతుజాలానికి పట్టుగొమ్మగా ఉన్న నర్సాపూర్ అడవులను ఖచ్చితంగా పునరుజ్జీవనం చేసుకోవాలని , అందుకోసం తక్షణ చర్యలు తక్షణం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు , ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి , అటవీ సంరక్షణ ప్రధానాధికారి ( Pccf) పీ.కే. ఝా , హరితహారం osd ప్రియాంక వర్గీస్ నర్సాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించారు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి , అటవీ శాఖ ఛీప్ కన్జర్వేటర్ ఏ.కె. సిన్హా , జిల్లా అటవీ అధికారి పద్మజా రాణి , ఆర్డీవో వెంకటేశ్వర్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ముందుగా అటవీ ప్రాంతంలో విసృతంగా పర్యటించిన ఉన్నతాధికారులు ఆ తర్వాత నర్సా...