డిజిటల్ యుగంలో సోషల్ మీడియానే అసలైన శక్తి
-యూసుఫ్గూడలో బీజేపీ సికింద్రాబాద్ పార్లిమెంట్ సోషల్ మీడియా 'నరేటివ్, నెట్వర్క్, నేషన్ బిల్డింగ్' వర్క్షాప్ -ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉండాలని సోషల్ మీడియా వారియర్లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు తూఫాన్,హైదరాబాద్ :- నేటి ఆధునిక డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా కేవలం సమాచార మార్పిడికి మాత్రమే పరిమితం కాలేదని, అది ప్రజాభిప్రాయాన్ని నిర్మించే శక్తివంతమైన సాధనంగా అవతరించిందని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా కమిటీ ఆధ్వర్యంలో యూసుఫ్గూడలోని ఎస్ఎంఎస్ఈ (SMSE) ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సోమవారం నిర్వహించిన 'నరేటివ్, నెట్వర్క్, నేషన్ బిల్డింగ్' వర్క్షాప్ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నిర్మాణాత్మక పాత్ర పోషించాలి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సామాజిక మాధ్యమాల పాత్ర కీలకమన్నారు. సోషల్ మీడియా వాలంటీర్లు కేవలం పోస్టులు పెట్టడమే కాకుండా, సానుకూల దృక్పథంతో బాధ్య...