క్లోజ్ అయిన గనులను పునరుపయోగానికి మార్గం – కిషన్ రెడ్డి
బొగ్గు గనుల మూసివేత అనంతరం వృక్షసంపద అభివృద్ధికి చర్యలు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ హైదరాబాద్ శివార్లలోని కాన్హా శాంతివనంలో బొగ్గు, గనుల శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైన్ క్లోజర్, మినరల్ ఎక్స్ప్లొరేషన్ కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ దిశగా జరిగిన ప్రయత్నాలను అధికారులు వెల్లడించగా.. ఇకపై చేపట్టాల్సిన అంశాలపై కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. మైనింగ్ కు సంబంధించిన పలు అంశాలను కూడా లెవనెత్తారు. వీటికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అధికారులు సమాధానం ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి చొరవతీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైన్ క్లోజర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను సభ్యులందరూ ప్రశంసించారు. మైన్ క్లోజర్ సందర్భంగా.. మైనింగ్ కోసం భూములిచ్చి ఉద్యోగాలు పొందిన వారికి మళ్లీ ఉపాధి కల్పించడం, తదితర అంశాలను సభ్యులు లేవనెత్తారు. దీనిపై దృష్టిసారిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతోపాటుగా, కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని కిషన...