భారత భద్రత.. రాజీలేని పోరాటం....
'ఆపరేషన్ సింధూర్' మన దృఢ సంకల్పానికి నిదర్శనం: ప్రధాని మోదీ కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో "మన్ కీ బాత్" వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులూ... తూఫాన్(హైదరాబాద్) :- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన్ కీ బాత్' 129వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని, పార్టీ శ్రేణులు, స్థానిక పారిశుధ్య కార్మికులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా 2025 ఏడాదిని భారతావనికి జాతీయ గర్వకారణమైన సంవత్సరంగా ప్రధాని అభివర్ణించారు. దేశ భద్రత, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట దేశ రక్షణలో భారత్ రాజీలేని పోరాట పటిమను ప్రదర్శిస్తోందని, 'ఆపరేషన్ సింధూర్' ద్వారా మన జాతీయ భద్రతా దృఢత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పామని ప్రధాని పేర్కొన్నారు. వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి దేశభక్తిని మరోసారి ప్రధాని స్మరించుకున్నారు. అలాగే 'తమిళం నేర్చుకుందాం - తమిళ కరకలం' చొరవ ద్వారా భాషా వైవిధ్యం, సాంస్కృతిక ఐక్యతను పెంపొ...