విద్యార్థులు లక్ష్య సాధనలో 'కలాం'ను స్ఫూర్తిగా తీసుకోవాలి: డాక్టర్ కె. లక్ష్మణ్
అశోక్ నగర్ లో పేద విద్యార్థులకు స్టడీ కిట్ల పంపిణీ మాజీ కార్పొరేటర్ టి. శైలజ గోపాల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఉచిత ట్యూషన్ చెబుతున్న ఉపాధ్యాయులకు ఘన సన్మానం తూఫాన్, హైదరాబాద్ :- కష్టపడి చదివి "నేను ఏదైనా సాధించగలను" అన్న ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందడుగు వేయాలని రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో శనివారం పేద విద్యార్థులకు ఉచిత స్టడీ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ కార్పొరేటర్, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు టి.శైలజ గోపాల్ మరియు రేస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల కోసం వారికి అవసరమైన పుస్తకాలు, ప్యాడ్లు, స్టేషనరీతో కూడిన స్టడీ కిట్లను అందజేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టే శైలజ గోపాల్ వంటి నాయకులకు, రేస్ వంటి సంస్థలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థు...