ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి హైదరాబాద్ మే 24 (తూఫాన్) రైతు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ ప్రాంతాల నుండి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి ఇతర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులతో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సాగు జరిగిందని, ఇందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కనీస మద్దత...