గ్రేటర్లో 72 పార్కుల సుందరీకరణ పూర్తి ... మొత్తం లక్ష్యం 100 ఉద్యాన వనాలు
గ్రేటర్లో 72 పార్కుల సుందరీకరణ పూర్తి ... మొత్తం లక్ష్యం 100 ఉద్యాన వనాలు గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకు మరింత మెరుగైన జీవన విధానం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికిగాను కొత్తగా వంద ఉద్యాన వనాల ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించగా మరో నెలరోజుల్లో వంద పార్కుల నిర్మాణం పూర్తిఅవనున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.40కోట్ల వ్యయంతో 100నూతన పార్కులను వివిధ కాలనీలు, బస్తీల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేసింది. దీనిలో భాగంగా నేటి వరకు 72పార్కులు పూర్తై నగరవాసులకు అందుబాటులోకి రాగా మిగిలిన 28పార్కుల నిర్మాణాన్ని ఏప్రిల్ 30వ తేదీలోగా పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి ఆదేశించడంతో నిర్థారిత సమయంలో ఈ పార్కులను పూర్తి చేయడానికి అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ముమ్మరంగా పనులను నిర్వహిస్తోంది. ఈ వంద పార్కుల్లో అధిక శాతం కాలనీలలో నిర్మిస్తుండడంతో పాటు నిర్మాణంలో సంబంధిత కాలనీ సంక్షేమ సంఘాలు వాటి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నాయి. పూర్తి అయిన పార్కుల నిర...