Posts

Showing posts with the label #bandarudattatreya #PMMODI #Fuelsaving #publictransport

సికింద్రాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు రైల్లో బండారు దత్తాత్రేయ ప్రయాణం

Image
  తూఫాన్, హైదరాబాద్ :- ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు మద్దతుగా హర్యానా మాజీ గవర్నర్, మాజీ రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభం, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో.. వ్యక్తిగత ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణే ధ్యేయంగా ఆయన సాధారణ ప్రయాణికుడిలా రైలు బాట పట్టారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటన నిమిత్తం దత్తాత్రేయ శుక్రవారం (మే 29) ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలులో ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో, ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజారవాణాను ఆశ్రయించడం ద్వారా అటు వ్యక్తిగత ఖర్చులు తగ్గడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని, ప్రధాని పిలుపు మేరకు ఆర్థిక వనరులను పొదుపు చేయడంలో భాగస్వాముల...