Posts

Showing posts with the label #bandarudattatreya #BMS

ఐడీపీఎల్ కార్మికుడి నుంచి ‘బీఎంఎస్’ జాతీయ అధ్యక్షుడి వరకు..

Image
మల్లేశం కృషి అమోఘం: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసలు తూఫాన్,హైదరాబాద్ :- భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సుంకరి మల్లేశం కు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. బుధవారం హైదరాబాద్‌లోని రాంనగర్‌లో దత్తాత్రేయను మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లేశంను సత్కరించిన దత్తాత్రేయ, ఆయన నాయకత్వంలో దేశంలోని కార్మిక శక్తి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మల్లేశం ఐడిపిఎల్ (IDPL)లో కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, అంకితభావంతో పనిచేస్తూ నేడు జాతీయ స్థాయి అత్యున్నత పదవికి చేరుకోవడం గర్వకారణమని దత్తాత్రేయ కొనియాడారు. గతంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని గుర్తుచేశారు. తాను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే మల్లేశం సామర్థ్యాన్ని గుర్తించి ఇపిఎఫ్‌ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా నియమించానని, ఆ బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వర్తించారని దత్తాత్రేయ ప్రశంసించారు. మల్లేశం సారథ్యంలో బిఎంఎస్ మరిన్ని విజయాలు సాధించాలని, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఆయన కోరార...