Posts

Showing posts with the label #telugunews ##telangananews

*గల్ఫ్ మృతదేహం తరలింపు ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం*

Image
*గల్ఫ్ మృతదేహం తరలింపు ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం* ● కంపెనీ యాజమాన్యం చేతులెత్తేసిన వేళ… ● నిధులు లేవంటూ చెప్పిన ఇండియన్ ఎంబసీ ● రూ.10 లక్షల ప్రవాసీ బీమా ఉండి కూడా ఉపయోగం లేదు.  ● సీఎం సహాయనిధి ద్వారా రూ.1.50 లక్షల మానవీయ సాయం ● ప్రవాసీ ప్రజావాణి ఇంచార్జి జి. చిన్నారెడ్డి, ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ చొరవ గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసిన పరిస్థితిలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ వ్యయాన్ని పూర్తిగా భరించిన అరుదైన మానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రవాస తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చూపుతున్న బాధ్యతకు ఇది మరో ఉదాహరణ.  నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) అనే 40 ఏళ్ల కార్మికుడు,  నాలుగు నెలల క్రితం ఓమాన్ దేశంలోని సలాలా ప్రాంతంలో ఒక క్లీనింగ్ కంపెనీలో పని చేయడానికి వెళ్లాడు. యాజమాన్యం వైఖరి నచ్చక కంపెనీ నుంచి బయటకు వెళ్లిన కొంతకాలానికే, డిసెంబర్ 14న ఇబ్రి ప్రాంతంలో మ...