Posts

Showing posts with the label telugunews

రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : సీఎం

Image
రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతను తీర్చిదిద్దే కార్యక్రమాలను చేపడుతామని వెల్లడించారు.  కొలువుల పండుగలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–IIIలో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, కొత్తగా ఎంపికైన ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. “పరిపాలనలో ప్రక్షాళన జరగాలంటే సంపూర్ణంగా సహకరించాలి. కొత్తగా చేరిన వారంతా చిత్తశుద్ధితో పనిచేయాలి.  దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలంటే మీరంతా కష్టపడి పనిచేయాలి. తలవంచకుండా, 30 నుంచి 35 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం తల ఎత్తుకుని పనిచేశానని గర్వంగా చెప్పుకునేలా పని చేయాలి.  ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది.  తద్వారా తెలంగాణను ఒక...

July 14th, Monday - 2025, Toofan Telugu News Daily

Image
 

నెహ్రూ జూలాజికల్ పార్కులో “వనమహోత్సవం” ఘనంగా ప్రారంభం

Image
 తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పర్యావరణ కార్యక్రమంగా నిలిచిన “వనమహోత్సవం” ఈ రోజు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టెలంగాణ జూ పార్క్స్ డైరెక్టర్ డా. సునీల్ ఎస్. హిరేమత్, ఐఎఫ్ఎస్ , మరియు క్యూరేటర్  జె. వసంత , జూ సిబ్బంది పాల్గొని మొత్తం 250 చెట్లను నాటారు . ఈ సందర్భంగా డా. సునీల్ హిరేమత్ మాట్లాడుతూ, నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను “హైదరాబాద్ ఆకుపచ్చ ఊపిరితిత్తులు” అని పేర్కొన్నారు. ఇది నగర ప్రజలకు పచ్చదనం, ప్రశాంతతను అందించే ప్రదేశంగా విశేషంగా పేరుపొందిందని, దేశంలోనే అగ్రశ్రేణి జంతు ప్రదర్శనశాలల్లో ఒకటిగా సందర్శకుల అభిప్రాయం పొందిందన్నారు. క్యూరేటర్ జె. వసంత, ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ, నెహ్రూ జూ పార్క్ వన్యప్రాణులు, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రతి పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. అంతేకాక, జూ సిబ్బందిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ తమ నివాస ప్రాంగణంలో కనీసం రెండు చెట్లు నాటి, వాటిని తమ పిల్లలలాగా పరిరక్షించాలి” అని సూచ...