ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హైదరాబాద్, జూన్ 16( TOOFAN ): ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వచ్చిన విన్నపాల పరిష్కారంలో జాప్యం చేయరాదని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో నగరం నలువైపుల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్ కు విన్నవించారు. ప్రజలు విన్నవించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... గ్రేటర్ వ్యాప్తంగా తమ సమస్యలను తెలియజేయడానికి, విన్నపం అందజేసిన నేపథ్యంలో అధికారులు కూడా వారి విన్నవించిన సమస్యను బాధ్యత తో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో సంబంధిత హెచ్ఓడి లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 74 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 35, ట్యాక్స్ సెక్షన్ 7, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలకు 5 చొప్పున, ఎలక్ట్రికల్ విభాగం 4, యు.బి.డి విభాగం...