Posts

Showing posts with the label #Videoconferencejoshi #DrSkjoshi #Telangananews #Cmkcr #Ktr

తెలంగాణకు హరితహారం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో ఒకటి

Image
• తెలంగాణకు హరితహారం, జాతీయ రహదారుల భూసేకరణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ డా.ఎస్.కె జోషి వీడియో కాన్ఫరెన్స్. • నాలుగో విడత హరితహారం జులై రెండో వారంలో ప్రారంభానికి సన్నాహాలు  • మెరుగైన ఫలితాల కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సిబ్బందికి రెండు రోజుల చొప్పున శిక్షణ ముందస్తు చర్యలు పకడ్భందీగా ఉండాలి • మొక్కలు, నాటే ప్రాంతాల ఎంపిక, పిట్స్ తవ్వకం పూర్తి చేయాలి తెలంగాణకు హరితహారం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో ఒకటని, ఏమాత్రం పొరపాట్లు జరగకుండా నాలుగో విడత హరితహారం కోసం సన్నద్దం కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలకు చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి పిలుపు నిచ్చారు. ఈయేడాది హరితహారంలో 39 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటాలని నిర్ణయించామని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొక్కలు నాటే ప్రాంతాల గుర్తింపులో కొన్ని జిల్లాలు వెనుకపడ్డాయని తక్షణం ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రాంతాల గుర్తింపు, ముందుస్తుగా పిట్స్ తవ్వకం, రక్షణా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సారి హరితహారంలో స్కూలు పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని, వారినే ప...