Posts

Showing posts with the label #telanganagoverner #shivpratapshukla #formergoverner #bandarudattatreya

రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు బండారు దత్తాత్రేయ వినతి

Image
  తూఫాన్, హైదరాబాద్‌: తెలంగాణలోని గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లోని సమస్యలపై ఒక వినతిపత్రాన్ని అందజేశారు. గిరిజనుల భూ హక్కుల పరిరక్షణ, పోడు వ్యవసాయ సమస్యల పరిష్కారం, 1/70 చట్టం సమర్థవంతమైన అమలు, పెసా (PESA) చట్టం అమలు వంటి అంశాలను గవర్నర్ దృష్టికి దత్తాత్రేయ తీసుకువెళ్లారు. అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనులందరికీ హక్కులు కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని కోరారు. గిరిజనుల సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూ ఆక్రమణలు నిరోధించడానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఉపాధి కొరత తీర్చడానికి రాష్ట్ర గిరిజన సలహా మండలి (Tribal Advisory Council) ద్వారా తగిన చర్యలు చేపట్టాలని దత్తాత్రేయ కోరారు. గిరిజన సమాజ అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ...

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో బండారు దత్తాత్రేయ భేటీ

Image
- లోక్ భవన్‌లో మర్యాదపూర్వక సమావేశం.. ప్రజా ప్రయోజన అంశాలపై చర్చ తూఫాన్,హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని గవర్నర్ అధికారిక నివాసం 'లోక్ భవన్' (రాజ్ భవన్)లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి తన శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు గంటసేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులు మరియు పలు ప్రజా ప్రయోజన అంశాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న పాలనాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విషయాలపై వారు తమ ఆలోచనలను పంచుకున్నారు. అనుభవజ్ఞులైన ఇద్దరు నేతల మధ్య జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.