24 ఏళ్ల వయసులోనే డివిజన్ సాధించిన విద్యార్థి నేత – అదే డివిజన్ నుంచి విజయం సాధిస్తానన్న వినయ్ కుమార్
తూఫాన్(హైదరాబాద్):- ప్రజాస్వామ్య మార్గంలో పోరాడితే ఏదైనా సాధ్యమని నిరూపించారు ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకుడు వినయ్ కుమార్ (24). బాగ్లింగంపల్లి డివిజన్ సరిహద్దులు, పేరు మార్పు, మరియు పరిపాలనాపరమైన అవకతవకలపై ఆయన సాగించిన సుదీర్ఘ పోరాటం చివరకు ఫలించింది. కేవలం 24 ఏళ్ల ప్రాయంలోనే రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో హైకోర్టు ద్వారా జీహెచ్ఎంసీ అధికారుల మెడలు వంచి, తన డివిజన్ సమస్యకు పరిష్కారం సాధించడం ఇప్పుడు నగర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారుల మొండివైఖరి.. హైకోర్టు జోక్యం డివిజన్ సమస్యలపై తొలుత జీహెచ్ఎంసీ కమిషనర్కు వినయ్ కుమార్ విన్నవించినా, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వెనక్కి తగ్గకుండా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వినయ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. తక్షణమే విచారణ జరపాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులతో దిగివచ్చిన అధికారులు విచారణ చేపట్టి, వినయ్ కుమార్ సూచించిన మార్పులను అమలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ సిద్ధాంతమే ప్రేరణ ఈ విజయంపై వినయ్ కుమార్ స్పందిస్తూ.. "రాజ్యాంగమే మన బలం" అని రాహుల్ గాంధీ చెప్పే మా...