ఖైదీల ఎస్కార్ట్ వ్యవస్థ బలోపేతానికి డీజీపీ కార్యాలయంలో సమీక్ష: సమన్వయానికి కొత్త మార్గదర్శకాలు
డిజిపి కార్యాలయంలో ఖైదీల ఎస్కార్ట్ పై గురువారం నాడు ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఖైదీల ఎస్కార్ట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమైన మార్గదర్శకాలను శాంతి భద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ జారీ చేశారు. నూరు శాతం ఖైదీల ఎస్కార్ట్ ను సమర్ధంగా చేసిన వారిని వ్యక్తిగతంగా అభినందించారు. ఇతర రాష్ట్రాలతో సమన్వయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఎస్కార్ట్ అభ్యర్థనల కోసం రేడియో సందేశాలు కనీసం ఒక వారం ముందే పంపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది మెరుగైన ప్రణాళికకు దోహదపడుతూ, చివరి నిమిషపు లాజిస్టికల్ సమస్యలను నివారించగలదని అన్నారు. అన్ని సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం, లా అండ్ ఆర్డర్, సి ఏ ఆర్, జైళ్లు, కోర్టు అనుసంధానం విభాగాల అధికారులతో కలిసి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఖైదీల ఎస్స్కార్టు తేదీలు, సమయాలు, ఎస్కార్ట్ ఏర్పాట్లపై తక్షణ సమాచారం మార్పిడి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాలో బయట ఖైదీ ఎస్కార్ట్ శాతం తక్కువగా ఉండే యూనిట్లపట్ల ఆందోళన వ్యక్తం చేసి...