`రంగస్థలం` నటుడిగా బాధ్యతను పెంచింది: నటుడు ఆది పినిశెట్టి
`రంగస్థలం` నటుడిగా బాధ్యతను పెంచింది: నటుడు ఆది పినిశెట్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన `రంగస్థలం` ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసి సక్సెస్ చేసిన ప్రేక్షకాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో చిట్టిబాబు (రామ్ చరణ్) అన్నయ్య పాత్రలో నటించిన కుమార్ బాబు ( ఆది పినిశెట్టి) తన బిజీ షెడ్యూల్ కారణంగా వేడుకకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియా ముందుకొచ్చి `రంగస్థలం` అనుభూతులను మీడియాతో పంచుకున్నారు. ఆ వేంటో ఆయన మాటల్లోనే... `ఓ సినిమా ఫోటో షూట్ కారణంగా నిన్న జరిగిన `రంగస్థలం` థాంక్స్ మీట్ కు హాజరుకాలేకపోయాను. ఆ హ్యాపీ మూవ్ మేంట్ ను మీతో, యూనిట్ తో పంచుకోలేకపోయాను. అందుకు బాధగా కూడా ఉంది. `రంగస్థలం` పెద్ద విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ నేను నటించిన ప్రతీ పాత్రను ప్రేక్షకులు...మీడియాతో ఎంతో సపోర...