దుర్గాష్టమి పూజ నిర్వహించిన మేయర్ హైదరాబాద్, అక్టోబర్ 1(Toofan): విజయదశమి పురస్కరించుకొని బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్ లో (Vijaya Lakshmi) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor - GHMC) దంపతులు దుర్గాష్టమి పూజ నిర్వహించారు. అదనపు కమిషనర్ లు రఘు ప్రసాద్, కే వేణుగోపాల్, విజిలెన్స్ డీఎస్పీ నరసింహ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, ఓఎస్డి విజయ్ కృష్ణ, అఖిల్,పేషీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది కి మేయర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలందరిపై ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రార్థించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరం ఇంకా అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.