Posts

Showing posts with the label telangananews

నెహ్రూ జూలాజికల్ పార్కులో “వనమహోత్సవం” ఘనంగా ప్రారంభం

Image
 తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పర్యావరణ కార్యక్రమంగా నిలిచిన “వనమహోత్సవం” ఈ రోజు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టెలంగాణ జూ పార్క్స్ డైరెక్టర్ డా. సునీల్ ఎస్. హిరేమత్, ఐఎఫ్ఎస్ , మరియు క్యూరేటర్  జె. వసంత , జూ సిబ్బంది పాల్గొని మొత్తం 250 చెట్లను నాటారు . ఈ సందర్భంగా డా. సునీల్ హిరేమత్ మాట్లాడుతూ, నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను “హైదరాబాద్ ఆకుపచ్చ ఊపిరితిత్తులు” అని పేర్కొన్నారు. ఇది నగర ప్రజలకు పచ్చదనం, ప్రశాంతతను అందించే ప్రదేశంగా విశేషంగా పేరుపొందిందని, దేశంలోనే అగ్రశ్రేణి జంతు ప్రదర్శనశాలల్లో ఒకటిగా సందర్శకుల అభిప్రాయం పొందిందన్నారు. క్యూరేటర్ జె. వసంత, ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ, నెహ్రూ జూ పార్క్ వన్యప్రాణులు, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రతి పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. అంతేకాక, జూ సిబ్బందిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ తమ నివాస ప్రాంగణంలో కనీసం రెండు చెట్లు నాటి, వాటిని తమ పిల్లలలాగా పరిరక్షించాలి” అని సూచ...