గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో బండారు దత్తాత్రేయ భేటీ

- లోక్ భవన్‌లో మర్యాదపూర్వక సమావేశం.. ప్రజా ప్రయోజన అంశాలపై చర్చ



తూఫాన్,హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని గవర్నర్ అధికారిక నివాసం 'లోక్ భవన్' (రాజ్ భవన్)లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి తన శుభాకాంక్షలు తెలియజేశారు.


సుమారు గంటసేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులు మరియు పలు ప్రజా ప్రయోజన అంశాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న పాలనాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విషయాలపై వారు తమ ఆలోచనలను పంచుకున్నారు. అనుభవజ్ఞులైన ఇద్దరు నేతల మధ్య జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.




 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!