క్లోజ్ అయిన గనులను పునరుపయోగానికి మార్గం – కిషన్ రెడ్డి

  • బొగ్గు గనుల మూసివేత అనంతరం

  •  వృక్షసంపద అభివృద్ధికి చర్యలు

  •  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ హైదరాబాద్ శివార్లలోని కాన్హా శాంతివనంలో బొగ్గు, గనుల  శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైన్ క్లోజర్, మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ దిశగా జరిగిన ప్రయత్నాలను అధికారులు వెల్లడించగా.. ఇకపై చేపట్టాల్సిన అంశాలపై కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు.  మైనింగ్ కు సంబంధించిన పలు అంశాలను కూడా లెవనెత్తారు. వీటికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అధికారులు సమాధానం ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి చొరవతీసుకుంటామని పేర్కొన్నారు.


    ఈ సందర్భంగా మైన్ క్లోజర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను సభ్యులందరూ ప్రశంసించారు. మైన్ క్లోజర్ సందర్భంగా.. మైనింగ్ కోసం భూములిచ్చి ఉద్యోగాలు పొందిన వారికి మళ్లీ ఉపాధి కల్పించడం, తదితర అంశాలను సభ్యులు లేవనెత్తారు. దీనిపై దృష్టిసారిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతోపాటుగా, కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. https://toofandailytelugu.blogspot.com/2025/07/july-3rd-thursday-2025-toofan-telugu.html ఉద్యోగుల ఇన్సూరెన్స్ విషయంలో తమ ప్రభుత్వం చొరవతీసుకుని.. ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ మొత్తానికి అదనంగా ప్రతి ఒక్కరికీ అదనంగా కోటిరూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నమని వెల్లడించారు. ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలను పకడ్బందీగా తీసుకుంటున్నామన్నరు.

    ఈ కార్యక్రమంలో బొగ్గు ఘనుల సహాయమంత్రి సతీష్ చంద్రదూబే గారితో పాటు  కమిటీ సభ్యులైన ఎంపీలు, గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావ్, బొగ్గు, గనుల శాఖ  ఉన్నతాధికారులు, కోలిండియా చైర్మన్ పీఎం ప్రసాద్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ సహా వివిధ పిఎస్ యు ల సీఎండీ లు ఈ రెండు శాఖల అధికారులు పాల్గొన్నారు.


    అనంతరం .. హార్ట్ ఫుల్ నెస్ సెంటర్, కన్హా శాంతి వనంతో కోలిండియా, సింగరేణి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.


    సింగరేణి, కాన్హా మధ్య ..  రామగుండం లో గ్రీన్ వాల్ నిర్మాణానికి సింగరేణి ఒప్పందం కుదిరింది.  కొలిందియా కూడా దేశంలోని వివిధ బొగ్గు గని ప్రభావిత ప్రాంతాల్లో అటవీ సంపద ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 


    అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ..


    దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో కోల్​ మైనింగ్​ చేసి కోల్​ తీసుకోవడం జరిగింది. కోల్​ తీసుకున్న తర్వాత కోల్​ బ్లాక్స్​ అలాగే వదిలేశారు. సైంటిఫిక్​ సిస్టమ్​ లో ఆ బ్లాక్​ లను క్లోజ్​ చేసి ఆ ల్యాండ్​ మళ్లీ ఉపయోగపడేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


    ఇటీవల ప్రధానమంత్రి .. ఈ విషయంపై ఒక ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి.. దేశంలో ఉన్న సుమారు 143 కోల్​ మైన్స్ (బొగ్గు వెలికితీత పూర్తయిన) గనులను సైంటిఫిక్​ పద్ధతిలో, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో క్లోజ్​ చేయాలని ఆదేశించారు. ఇందుకోసం.. అక్కడున్న ప్రజలకు ఉపయోగపడేలా, రైతులకు ఉపయోగపడేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరమే సుమారు 10 గనుల్లో పని మొదలు పెట్టి దాదాపు ఏడెనిమిది గనులను మూసివేశాం. రానున్న రోజుల్లో మిగతా 130 మైన్స్​ అన్నిటినీ కూడా క్లోజ్​ చేసి, అటవీ, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటాం. సమాజానికి ఉపయోగపడేలా వాటిని మార్చుతాం. షాద్​ నగర్​ లో ఉన్న హార్ట్​ ఫుల్ నెస్ సంస్థ వృక్షసంపదను పెంచేదిశగా చేపడుతున్న చర్యల స్ఫూర్తితో  మైన్స్​ క్లోజ్​ చేసిన తర్వాత సమాజానికి ఉపయోగపడేలా వృక్ష సంపద పెంచుతాం. ఇందుకోసం హార్ట్​ ఫుల్​ నెస్ సంస్థతో ఎంఓయూ  కూడా కుదుర్చుకున్నాం.

    Comments

    Popular posts from this blog

    సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

    లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి