Posts

మహిళా చైతన్యం వర్ధిల్లాలి.. రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు

Image
- 1908 నాటి పోరాటమే మహిళా దినోత్సవానికి పునాది - జై మహాభారత పార్టీ ఆధ్వర్యంలో మహిళామణులకు సత్కారం తూఫాన్,హైదరాబాద్ :- మహిళల హక్కులు, సమానత్వం కోసం జరిగిన పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవమని భగవాన్ అనంత విష్ణుదేవప్రభు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. చారిత్రక నేపథ్యంపై విశ్లేషణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ ఆవిర్భావం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1908లో న్యూయార్క్‌లో పనిగంటలు, సరైన వేతనం కోసం వస్త్ర పరిశ్రమలో పనిచేసే మహిళా కార్మికులు చేపట్టిన నిరసన ప్రపంచవ్యాప్త మహిళా చైతన్యానికి నాంది పలికిందన్నారు. దీనిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8వ తేదీని అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు. కుటుంబ వ్యవస్థకు మహిళే ఆధారం కుటుంబ వ్యవస్థలో, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని, వారికి తగిన గౌరవం ...

March 11th, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

March 10th, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

మహిళల సాధికారతతోనే దేశాభివృద్ధి.. బాగ్‌లింగంపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు

Image
- బండారు వైష్ణవ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారాలు - ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తూఫాన్, హైదరాబాద్ :- సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, అన్ని రంగాల్లో వారు సాధిస్తున్న పురోగతి గర్వకారణమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బండారు వైష్ణవ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. బండారు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళామణులను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే దేశం మరింత వేగంగా అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు. నేడు మహిళలు పురుషులతో సమానంగా శాస్త్ర సాంకేతిక, రాజకీయ, సామాజిక రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. వారి విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తి మాధవిలత, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, ఇఫ్లూ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ సునైనా సింగ్, రమాదేవి, టీవీ9 ప్రతినిధి దీప్తి వాజ...

March 8th, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

సివిల్స్ ఫలితాల్లో ఆర్.సి. రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ హవా

Image
- 60కి పైగా ర్యాంకులతో అభ్యర్థుల ఘనవిజయం  - ఫ్యాకల్టీ సహకారం, ఇంటర్వ్యూ గైడెన్స్ భేష్: ర్యాంకర్ల వెల్లడి   తూఫాన్, హైదరాబాద్ :- యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్.సి. రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ విద్యా సంవత్సరం తమ సంస్థ నుంచి 60కి పైగా ర్యాంకులు లభించినట్లు స్టడీ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ సంఘమిత్ర తెలిపారు. హిమాయత్ నగర్‌లోని స్టడీ సర్కిల్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ర్యాంకర్లతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా 259వ ర్యాంకర్ వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. మూడో ప్రయత్నంలో తనకు ఈ విజయం దక్కిందని వివరించారు. ప్రస్తుతం జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తాను, సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కృషి చేశానన్నారు. తనలోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకోవడంలో ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ ఎంతగానో తోడ్పడిందని కృతజ్ఞతలు తెలిపారు. మరో ర్యాంకర్ కుమ్మరి శ్రవణ్ కుమార్ (768వ ర్యాంకు) మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఫ్యాకల్టీ గైడెన్స్ వల్లనే ఈ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నా...

సివిల్స్ ఫలితాల్లో లా ఎక్సలెన్స్ విద్యార్థుల ఘనవిజయం

Image
- టాప్ 100లో 12 ర్యాంకులు.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల హవా  తూఫాన్,హైదరాబాద్ :- యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ 2025-26 ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అకాడమీకి చెందిన అభ్యర్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో మెరిశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టాప్ 100లో 12 ర్యాంకులతో సహా మొత్తం 85 మంది అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 23, 53, 55, 178, 193, 409, 463, 472, 492 వంటి మెరుగైన ర్యాంకులు సాధించిన వారు లా ఎక్సలెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన వారే కావడం విశేషం. ఫలితాల విశ్లేషణ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. దక్షిణ భారతంలో అగ్రగామిగా.. గత కొన్నేళ్లుగా స్థిరమైన ఫలితాలు సాధిస్తూ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ దక్షిణ భారతదేశంలోనే నంబర్ వన్ సంస్థగా ఎదిగింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన శిక్షణ అందించడమే లక్ష్యంగా అకాడమీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే డిగ్రీ ప్లస్ ఐఏఎస్‌తో పాటు ఇంటర్ జీఈ (JEE), నీట్ (NEET), ఇంటర...