అమెరికా లేకుంటే ఇజ్రాయేలే లేదు: డోనాల్డ్ ట్రంప్

- నెతన్యాహుపై నిప్పులు చెరిగిన యూఎస్ అధ్యక్షుడు


- జీ-7 సదస్సు వేదికగా ఖతార్ అమీర్‌తో భేటీలో సంచలన వ్యాఖ్యలు


తూఫాన్, హైదరాబాద్ :- "అమెరికా అండ లేకపోతే అసలు ఇజ్రాయేల్ అనే దేశమే ఉండేది కాదు. ముఖ్యంగా నేను లేకుంటే ఇజ్రాయేల్‌కు మనుగడే లేదు. ఎందుకంటే ఆ దేశం కోసం నేను చేసిన సాహసోపేత నిర్ణయాలు మరే ఇతర అమెరికా అధ్యక్షుడు కూడా చేయలేదు" అని యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న జీ-7 సదస్సు వేదికగా మంగళవారం ఆయన ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సదస్సు మార్జిన్స్‌లో ఖతార్ అమీర్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

గతంలో ఇజ్రాయేల్ ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాలను ఎవరూ తీసుకోలేరని, కానీ ప్రస్తుత ఇజ్రాయేల్ నాయకత్వం దాన్ని విస్మరిస్తోందనే కోణంలో ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం, గాజాలో శాంతి స్థాపన మరియు బందీల విడుదల అంశాలపై ఖతార్ అమీర్‌తో సుదీర్ఘంగా చర్చించిన ట్రంప్.. నెతన్యాహు వైఖరిని తప్పుపట్టారు. జీ-7 సదస్సులో అమెరికా అధ్యక్షుడి నోట వచ్చిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇజ్రాయేల్-అమెరికా దౌత్య బంధాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.

 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!