అంబర్‌పేటలో కన్నులపండువగా శ్రీరామనవమి శోభాయాత్ర

- కన్నులపండువగా శ్రీరామనవమి వేడుకలు.. ఆధ్యాత్మిక శోభతో నిండిన వీధులు 


తూఫాన్, హైదరాబాద్ :- నగరంలోని అంబర్‌పేట నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్ర రామనామ స్మరణలో సాగింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య, కాషాయ జెండాల రెపరెపలతో అంబర్‌పేట ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

ప్రముఖుల సమక్షంలో వైభవంగా..

ఈ యాత్రలో కిషన్ రెడ్డితో పాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో సాగిన ఈ ఊరేగింపులో వేలాది మంది యువతీ యువకులు, భక్తులు ఉత్సాహంగా అడుగులు వేశారు. రామరాజ్య స్థాపన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ధర్మపథంలో నడవాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు.


సాంస్కృతిక ప్రదర్శనలు - యాత్ర సాగిన తీరు

అంబర్‌పేట నుంచి ప్రారంభమైన ఈ భారీ శోభాయాత్ర బాగ్‌అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట మీదుగా కాచిగూడ వరకు కొనసాగింది. దారిపొడవునా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు, భజనలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాత్రి వేళ కాచిగూడలోని వీర సావర్కర్ విగ్రహం వద్దకు చేరుకోవడంతో ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగిసింది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా, భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.














Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!