అంబర్‌పేటలో ఉచిత మెగా వైద్య శిబిరం

రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో వందలాది మందికి ఆరోగ్య పరీక్షలు



తూఫాన్,హైదరాబాద్ :-  స్థానిక చే నంబర్ చౌరస్తాలోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ వేదికగా ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. క్షత్రియ రాజ్‌పుత్ ట్రస్ట్ బోర్డ్, బద్రీవిశాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్, అగర్వాల్ సేవా దళ్ సంయుక్త ఆధ్వర్యంలో సాధురామ్ ఐ హాస్పిటల్, కిమ్స్ (KIMS), సన్‌షైన్ హాస్పిటల్స్ మరియు భగవాన్ మహావీర్ వికలాంగ్ సమితి సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు వందలాది మంది రోగులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ముఖ్యంగా కంటి పరీక్షలతో పాటు ఎముకలు, గుండె మరియు జనరల్ చెకప్‌లు నిర్వహించి రోగులకు తగిన సలహాలు సూచనలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని సందర్శించిన ఆయన, నిర్వాహకులు మరియు వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం వచ్చిన రోగులతో మాట్లాడి, అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, రిటైర్డ్ జడ్జి ఠాకూర్ గోపాల్ సింగ్, సీనియర్ అడ్వకేట్ అనూప్ కుమార్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు ప్రముఖులు ఠాకూర్ కుందన్ సింగ్, రాజేష్ సింగ్, రఘునందన్ సింగ్, ధీరేంద్ర సింగ్, సంతోష్ సింగ్ ఠాకూర్, ప్రదీప్ అగర్వాల్, సుధీర్ గుప్తా, సురేందర్ గోయల్ తదితరులు పాల్గొని శిబిర నిర్వహణను పర్యవేక్షించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా చేరువ చేయడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.







 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!