38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ‘పుస్తక స్ఫూర్తి’పై మేధోమథనం వచ్చే ఐదేళ్లలో అప్పులు లేని సమాజమే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు తూఫాన్(హైదరాబాద్) :- అక్షరం మనిషిని ఆలోచింపజేస్తుందని, పుస్తకం జీవితానికి కొత్త దిశను చూపే దారిదీపమని పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్లో భాగంగా ఆదివారం సాయంత్రం ‘అనిశెట్టి రజిత’ వేదికపై ‘పుస్తక స్ఫూర్తి - పుస్తకం ఒక దారిదీపం’ అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని వక్తలను సన్మానించారు. కోటి రూపాయలతో పుస్తకాల పంపిణీ: మంత్రి జూపల్లి ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో పఠనాసక్తిని పెంచేందుకు తమ శాఖ తరపున కోటి రూపాయల వ్యయంతో స్ఫూర్తిదాయక పుస్తకాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్...
యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు! - ‘అన్నగారి’కి ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించాలి: ఆలేరు ఇన్ఛార్జ్ రేగు బాలనరసయ్య డిమాండ్ - తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహానీయుడు యాదగిరిగుట్ట, మే 28 (తూఫాన్ బ్యూరో): తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి ఉత్సవాలు యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగావు. తెలుగుదేశం పార్టీ మండల, పట్టణ శాఖల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగు బాలనరసయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రేగు బాలనరసయ్య మాట్లాడుతూ.. నాడు రూ. 2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి అన్నార్తుల ఆకలి తీర్చిన అపర భగీరథుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో పేదలను పీడించిన పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, రైతులకు, గ్రామీణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, ఆత్మగౌరవాన్ని కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు వారి కీర్తి...
Comments
Post a Comment