జూబ్లీహిల్స్ నియోజక వర్గం లో రూ. 5.12 కోట్ల అంచనా వ్యయం తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జూబ్లీహిల్స్ నియోజక వర్గం లో రూ. 5.12 కోట్ల అంచనా వ్యయం తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రజా పాలన ప్రభుత్వం లో హైదరాబాద్ లోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పై ప్రణాళిక..
జూబ్లిహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతాం.
ప్రజా పాలన ప్రభుత్వాన్ని ఆస్వాదించండి .. అండగా ఉండండి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్,జూలై 11: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 5.15 కోట్ల రూపాయల తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్,వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. షేక్ పేట్ వార్డులో 315.90 లక్షల వ్యయం తో చేపట్టనున్న ఫ్లైఓవర్ క్రింద స్పోర్ట్స్ పార్క్ కి , కమ్యూనిటీ డెవలప్మెంట్ , ఫుట్ పాత్ తో పాటు హరిజన బస్తీ వద్ద సి సి రోడ్లు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఇక వెంగల్ రావు నగర్ వార్డు లో గురుద్వార్ కమాన్ వద్ద 100 .5 లక్షల వ్యయం తో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్ధాపన చేశారు. అనంతరం యూసఫ్ గూడ వార్డులో రూ.95.75 లక్షల వ్యయం తో కమలాపురి అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ పక్కన చేపట్ట నున్న సీసీ రోడ్ల నిర్మాణలకు శంకుస్థాపన చేశారు.
సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూబ్లిహిల్స్ నియోజకవర్గం లో ఈరోజు 5 కోట్ల రూపాయలకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని జూబ్లిహిల్స్ నియోజకవర్గంను అన్ని రంగాల్లో ముందుంచుతామని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని సమస్యలు తొలగిస్తున్నామన్నాడు. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బస్తీలు ,కాలనీలు అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించిన వారిలో వారికి సన్నిహిత ఉన్నవారి నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి జరిగాయని వివక్షపూర్తితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. హైదరాబాద్ ల తాగునీరు ,రోడ్లు ,డ్రైనేజీ సమస్యలు లేకుండా పరిష్కారం చేస్తున్నామని నగరంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నామన్నారు. నగర ప్రజలు ఎక్కడైనా ప్రజా సమస్యలు ఉంటే స్థానిక అధికారి ,ప్రజా ప్రతినిధుల దృష్టి కి లేదంటే మంత్రుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని,సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో పాటు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, తమ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అండగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు లు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాము ఎక్కడికి వెళ్లిన ప్రజలు నాళాలు, సీసీ రోడ్లు, డ్రింకింగ్ వాటర్ సమస్యలను తీర్చమని పబ్లిక్ కోరుతున్నారని ప్రజా సమస్యలన్నింటినీ తీరుస్తామన్నారు.స్థానికంగా ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే స్పెషల్ శాంక్షన్ చేయించి అభివృద్ధి చేస్తామన్నారు.
కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కమిషనర్ ఆర్వీ కర్ణన్,కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ,అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment