Posts

April 2nd, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

మహావీర్ అహింసా మార్గం మానవాళికి ఆదర్శం

Image
- రామ్ నగర్‌లో ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు - బండారు దత్తాత్రేయ ఘన నివాళులు  తూఫాన్, హైదరాబాద్ :- జైనిజం 24వ తీర్థంకరుడైన మహావీర్ జయంతి వేడుకలు మంగళవారం హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని, మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి సందేశం సదాస్మరణీయం ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహావీర్ బోధించిన అహింస, సత్యం, కరుణ అనే సిద్ధాంతాలు కాలాతీతమైనవని కొనియాడారు. లోకకల్యాణం కోసం ఆయన చూపిన మార్గం నేటికీ మానవాళిని సరైన దిశలో నడిపిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే మహావీర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, జైన సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 1st, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

March 31st, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

భారతీయ మూలాలను మరువద్దు: వెంకయ్య నాయుడు

Image
- భారతీయ మూలాలను మరువద్దు: వెంకయ్య నాయుడు  తూఫాన్, హైదరాబాద్ :- "భారతీయ నాగరికతలో కళలు కేవలం వినోద సాధనాలు కావు.. అవి మానసిక వికాసానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడే సోపానాలు" అని భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. శనివారం హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్‌లో వాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 'నాదోపాసన' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నాదాన్ని బ్రహ్మగా భావించే గొప్ప సంస్కృతి మనదని, సంగీతం ద్వారా దైవానికి దగ్గరవ్వడమే నిజమైన నాదోపాసన అని ఆయన అభివర్ణించారు. ఆలయాలు సంస్కృతీ నిలయాలు కావాలి ఒకప్పుడు గ్రామాల్లోని దేవాలయాలు కేవలం పూజా మందిరాలు మాత్రమే కాదని.. విద్య, శిల్పం, సంగీతం, సాహిత్యం పరిమళించే విశ్వవిద్యాలయాలని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. నేడు మళ్ళీ ఆ వైభవం రావాలని, ఆలయాలను భారతీయ సంస్కృతీ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రతి సాయంత్రం దేవాలయాల్లో సత్సంగాలు, హరికథలు, పురాణ కాలక్షేపం వంటి సంప్రదాయాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. తాను కూడా ప్రతిరోజూ అన్నమయ్య కీర్తనలు వింటూనే రోజును ప్రారంభిస్తా...

అంబర్‌పేటలో కన్నులపండువగా శ్రీరామనవమి శోభాయాత్ర

Image
- కన్నులపండువగా శ్రీరామనవమి వేడుకలు.. ఆధ్యాత్మిక శోభతో నిండిన వీధులు  తూఫాన్, హైదరాబాద్ :- నగరంలోని అంబర్‌పేట నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్ర రామనామ స్మరణలో సాగింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య, కాషాయ జెండాల రెపరెపలతో అంబర్‌పేట ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ప్రముఖుల సమక్షంలో వైభవంగా.. ఈ యాత్రలో కిషన్ రెడ్డితో పాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో సాగిన ఈ ఊరేగింపులో వేలాది మంది యువతీ యువకులు, భక్తులు ఉత్సాహంగా అడుగులు వేశారు. రామరాజ్య స్థాపన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ధర్మపథంలో నడవాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనలు - యాత్ర సాగిన తీరు అంబర్‌పేట నుంచి ప్రారంభమైన ఈ భారీ శోభాయాత్ర బాగ్‌అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట మీదుగా కాచిగూడ వరకు కొనసాగింది. దారిపొడవునా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు, భజనలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణ...

March 29th, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image