Posts

May 2nd, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

May 1st, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 30th, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

April 28th, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

జగిత్యాలలో పెట్రోల్ నిల్వలు పుష్కలం: కలెక్టర్ సత్యప్రసాద్

Image
 జగిత్యాలలో పెట్రోల్ నిల్వలు పుష్కలం: కలెక్టర్ సత్యప్రసాద్ బంక్ యజమానులతో అత్యవసర సమీక్ష.. అక్రమ నిల్వలపై ఉక్కుపాదం! రైతులకు ఇబ్బంది కలగొద్దు.. ముందస్తుగా ఇండెంట్ పెట్టాలని ఆదేశం జగిత్యాల (బ్యూరో): జిల్లాలో పెట్రోల్ సరఫరా, నిల్వలపై వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జరిగిన ఈ భేటీలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, చమురు సంస్థల ప్రతినిధులు మరియు బంక్ యజమానులతో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.  జిల్లాలోని అన్ని బంక్‌లలో ఉన్న నిల్వలు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న అమ్మకాల గణాంకాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా కొరత రాకుండా లోడింగ్ పెంచాలని చమురు సంస్థలను ఆదేశించారు. లాభాల కోసం పెట్రోల్‌ను అక్రమంగా నిల్వ చేసినా, కృత్రిమ కొరత సృష్టించినా బంక్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నిల్వల దృష్ట్యా ముందస్తుగానే కంపెనీలకు ఇండెంట్ పంపాలని సూచించారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా వ్యవసాయ వాహనాలకు పెట్రోల్ నిల్వలు అందుబాటులో ఉంచాలని, వ్యాపారస్తులకు అనవసరంగా...

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి -జగిత్యాల కలెక్టర్

Image
ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి - జగిత్యాల జిల్లా  కలెక్టర్ బి. సత్యప్రసాద్ పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య :63 ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపుకలెక్టర్ లు, ఆర్డీఓ లతో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు.  అర్జీలను  ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 63 ఫిర్యాదులు, వినత...

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జగిత్యాల జిల్లా ఎస్పీ

Image
 గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు పలు ఫిర్యాదులను పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, విచారణలో ఎటువంటి లోపం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించడం జరుగుతోందన్నారు.