Posts

Showing posts from June, 2025

July 1st, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

June 29th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

June 28th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

June 27th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

June 26th, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

June 25th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
   

June 24th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మనీషా

Image
 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మనీషా హైదరాబాద్, జూన్ 24(TOOFAN) తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు హైదరాబాద్‌లో మరో లంచం కేసును బట్టబయలు చేశారు. అంబర్‌పేటలోని గోల్నాక, నెహ్రూనగర్ వార్డు నంబర్–2 పరిధిలోగల హైదరాబాద్ మునిసిపల్ నికాయ పరిపాలనా సంచాలక (హై.మ.న.పా.సం.) కార్యాలయంలో పని చేస్తున్న సహాయక ఇంజనీరు టి.మనీషా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపించేందుకు సహకారం అందించాలన్న పేరిట టి.మనీషా ఫిర్యాదుదారుడి నుంచి మొత్తం రూ.15,000 లంచం కోరినట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే రూ.5,000 తీసుకున్న ఆమె, మిగతా రూ.10,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను అడ్డగించారు. ఘటనపై సంబంధిత ఆధారాలు సేకరించిన అనంతరం, టి.మనీషాను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, తదుపరి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇతర సంబంధిత వివరాలను పరిశీలిస్తున్నారు.

June 23rd, Monday - 2025, Toofan Telugu News Daily

Image
 

June 22nd, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

లంచం తీసుకుంటూ పట్టుబడిన కంప్యూటర్ ఆపరేటర్

Image
లంచం తీసుకుంటూ పట్టుబడిన కంప్యూటర్ ఆపరేటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(తూఫాన్‌)  – బూర్గంపహాడ్: రేషన్ కార్డు జారీ కోసం అధికారిక సహాయం చేయడాన్నికార‌ణంగా తీసుకొని రూ.2,500 లంచం తీసుకుంటుండగా బూర్గంపహాడ్ మండల తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ చిట్టెంశెట్టి నవక్రాంత్ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారుడి బంధువుకు సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తును ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, తద్వారా కొత్త రేషన్ కార్డు మంజూరు కావడానికి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేయాలంటే నగదు చెల్లించాల్సిందేనంటూ నవక్రాంత్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారుల గూర్చిన సమాచారం ప్రకారం, ఇతడు తరచుగా రేషన్ కార్డు దరఖాస్తుల వ్యవహారాల్లో లంచం డబ్బులను డిజిటల్ చెల్లింపుల రూపంలో తీసుకుంటూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రజలపై భారం వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

June 21st, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

June 20th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి

Image
 విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి -వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS. పోలీస్‌ అధికారులు అప్పగించిన పనుల్లో రాణించాలంటే వృత్తిలో నైపుణ్యం సాధించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు తెలిపారు. యూనిట్ స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ పోటీలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం ప్రారంభించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో వరంగల్‌ కమిషనరేట్‌ చెందిన సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లతో పాటు ఇతర పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గోంటున్న డ్యూటీ మీట్‌ పోటీలను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో రెండు రోజుల పాటు నిర్వహించబడుతాయి.  ఈ డ్యూటీ మీట్‌ లో పోలీస్‌ అధికారులు నిరంతరం నిర్వహించే విధులకు సంబంధించి అధికారులు, సిబ్బందికి డ్యూటీ మీట్‌ ద్వారా తమ ప్రతిభ కనబర్చడం జరుగుతుంది.  ఇందులో భాగంగా కంప్యూటర్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, హ్యాండ్లింగ్‌, ప్యాకింగ్‌ లిఫ్టింగ్‌, బాంబ్‌  డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఫోటో మరియు వీడియో గ్రఫీ విభాగాల్లో పోటీలను నిర్విహించబడుతాయి. ఈ పోటీల్లో విభాగాల వారిగా రాణించిన వారిని జోనల్ స్థాయిలో నిర్వహి...

June 19th, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

ఎసీబీకి చిక్కిన కార్యనిర్వాహక ఇంజనీరు బి. స్వరూప

Image
 ఎసీబీకి చిక్కిన  కార్యనిర్వాహక ఇంజనీరు బి. స్వరూప తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ చేసిన దాడిలో లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ, కాప్రా సర్కిల్-1 కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు.  "ఫిర్యాదుధారుడు పూర్తి చేసిన పనిని కొలతల పుస్తకంలో నమోదు చేయడానికి" అధికారిక సహాయం చేసేందుకు అతని నుండి రూ.1,20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన  హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ, కాప్రా సర్కిల్-1 కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు - బి. స్వరూప.

కేటీఆర్ మొబైల్ ఫోన్, లాప్టాప్ ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదు

Image
 కేటీఆర్ మొబైల్ ఫోన్, లాప్టాప్ ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదు  ---స్పష్టంగా పేర్కొన్న న్యాయవాదుల బృందం              ఫార్ములా ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ ఇవ్వాలన్న ఏసీబీ అంశంపై ఆయన న్యాయవాదులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాథమికంగా కేటీఆర్ న్యాయవాదులు పేర్కొనదాన్ని ప్రకారం... ప్రస్తుతం నడుస్తున్న విచారణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నిర్వహించిన క్రీడా కార్యక్రమానికి సంబంధించినది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రేసు నిర్వహణ పూర్తిగా అధికారుల యంత్రాంగం ద్వారా సాగింది. ఇందులో కేటీఆర్ గారు నిర్ణయానికి మినహా వ్యక్తిగతంగా పరిమిత పాత్ర మాత్రమే వహించారు.ఫార్ములా ఈ కేసు అనేది ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్ప, వ్యక్తిగత సంభాషణకు సంబంధించి కాదు అని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలతో పాటు ఆయా సంస్థలతో జరిగిన ఒప్పందాలన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని, జరిగిన ప్రతి నగదు లావాదేవీ అధికారికంగా బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు, అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ గారి ...

June 18th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

ఎసీబీకి చిక్కిన ఇంజనీర్ (పంచాయత్ రాజ్)

Image
 ఎసీబీకి చిక్కిన కరీంనగర్‌ ఇంజనీర్ (పంచాయత్ రాజ్) తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ చేసిన దాడిలో లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన కార్యనిర్వహణ ఇంజనీర్ (పంచాయత్ రాజ్).  ఫిర్యాదుధారునికి సంబంధించి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అద్దె వాహన బిల్లులను సిద్ధం చేయడానికి" అధికారిక సహాయం అందించేందుకు అతని నుండి రూ.8,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన కరీంనగర్‌లోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం, కార్యనిర్వహణ ఇంజనీర్ (పంచాయత్ రాజ్) వారి కార్యాలయంలో పనిచేస్తున్న సహాయ ఇంజనీరు - శరత్ మరియు సీనియర్ అసిస్టెంట్ -  వేణుగోపాల్‌.

ఆహారంలో నాణ్య‌త ప్ర‌మాణాలు తప్ప‌నిస‌రిగా పాటించాలి

Image
 ఆహారంలో నాణ్య‌త ప్ర‌మాణాలు తప్ప‌నిస‌రిగా పాటించాలి టూరిజం ప్లాజాలో మంత్రి జూప‌ల్లి ఆక‌స్మిక త‌నిఖీలు రెస్టారెంట్ ను ప‌రిశీలించి, ప‌ర్యాట‌కుల‌తో మాట్లాడిన మంత్రి         TOOFAN Telugu Daily -   టూరిజం ప్లాజా హోట‌ల్స్ లో ప‌రిశుభ్ర‌త పాటించాల‌ని,  ఆహారంలో నాణ్య‌త ప్ర‌మాణాలు  త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు. బేగంపేట‌లోని టూరిజం ప్లాజా హోట‌ల్ లో మంగ‌ళ‌వారం ఉద‌యం మంత్రి జూప‌ల్లి ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు. రెస్టారెంట్ అంతా క‌లియ‌తిరుగుతూ..  ఆహార పదార్థాలను, కిచెన్ ను పరిశీలించారు.  అల్ఫాహారం చేస్తున్న ప‌ర్యాట‌కులు, అతిధుల‌తో మంత్రి జూప‌ల్లి మాట్లాడారు. ఆహార  నాణ్య‌త‌, రుచి గురించి ఆరా తీశారు. అనంత‌రం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..  హ‌రిత హోట‌ల్స్ లో సౌక‌ర్యాలు, ఆహార నాణ్య‌త‌పై  నిరంతరం పరిశీలన కొనసాగిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప‌ర్యాట‌కుల‌కు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటల్స్ నిర్వాహకులపై ఉందని స్ప‌...

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

Image
  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్ *హైదరాబాద్, జూన్ 17:(TOOFAN)    సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏ ఎం అండ్ హెచ్ ఓ లు, ఎంటమాలజీ అధికారులతో శానిటేషన్, దోమల నివారణ, ఆస్తిపన్ను వసూళ్ల పై కమీషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ...  దోమల నివారణకు చేస్తున్న ఫాగింగ్ పై అసిస్టెంట్ మెడికల్ అధికారి పూర్తి బాధ్యత ఉంటుందని ఆదేశించారు. ఫాగింగ్ సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు తప్పని సరిగా చేయాలని, ఏ ఎల్ ఓ లు క్షేత్ర స్థాయిలో యాంటీ లార్వా కార్యక్రమం, ఉదయం, సాయంత్రం ఫాగింగ్ పనులు చేపట్టాలని, ఫాగింగ్ పెట్రోల్, డీజిల్ కూపన్ లు ఇవ్వమని, ఫ్రీ పెయిడ్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఈ ప్రక్రియ ఖైరతాబాద్ జోన్ లో ప్రయోగాత్మకంగా చేపట్టి సత్ఫలితాలు వచ్చాయన్నారు. మార్నింగ్ ఏ ఎల్ ఓ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు,  కాలేజీలో డెంగ్యూ, మలేరి...

June 17th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

ఏసీబీకి చిక్కిన‌ ములుగు జిల్లా విద్యాశాఖాధికారి

Image
  Telangana ACB Updates - ఫిర్యాదిధారుడు ఉద్యోగములో చేరేందుకు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించడానికి మరియు తదుపరి విధులలో చేరేందుకు ఆదేశాలు జారీ చేయడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.20,000/- #లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన ములుగు జిల్లా విద్యాశాఖాధికారి - గొర్ల పాణిని మరియు వారి కార్యాలయంలోనే గల ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్ - తొట్టె దిలీప్ కుమార్ యాదవ్‌.

ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్

Image
 ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హైదరాబాద్, జూన్ 16( TOOFAN ):     ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వచ్చిన విన్నపాల పరిష్కారంలో జాప్యం చేయరాదని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్  అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో నగరం నలువైపుల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్ కు విన్నవించారు. ప్రజలు విన్నవించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...  గ్రేటర్ వ్యాప్తంగా తమ సమస్యలను తెలియజేయడానికి, విన్నపం అందజేసిన నేపథ్యంలో అధికారులు కూడా వారి విన్నవించిన సమస్యను బాధ్యత తో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో సంబంధిత హెచ్ఓడి లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 74 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 35, ట్యాక్స్ సెక్షన్ 7, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలకు 5 చొప్పున, ఎలక్ట్రికల్ విభాగం 4, యు.బి.డి విభాగం...

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

Image
 లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి – బుధేరాలో ఓపెన్ ప్లాట్ నంబరింగ్‌కు రూ.8,000 లంచం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అవినీతి ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలానికి చెందిన బుధేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఓ ఫిర్యాదుదారుడు తనకు చెందిన ఓపెన్ ప్లాట్‌కు కొత్త ఇంటి నంబర్ కేటాయించడంతో పాటు వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటుకు అనుమతి కోరగా, దీనికి ప్రతిఫలంగా కార్యదర్శి రూ.8,000/- లంచం డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. ఫిర్యాదుదారుడు దీనిపై అధికారులను సమాచారమిచ్చాడు. అధికార బృందం పంచాయతీ కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటున్న సమయంలో నాగలక్ష్మిని పట్టుకుంది. 

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

Image
సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక         హైదరాబాద్, జూన్ 16 (TOOFAN):: సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ గా సి.హెచ్. ప్రియాంకా నేడు భాద్యతలు స్వీకరించారు. శాఖ స్పెషల్ కమీషనర్ గా ఉన్న డా. హరీష్ ను తెలంగాణ జెన్కో ఎం.డి గా బదిలీచేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ గాఉన్న సి.హెచ్. ప్రియాంక ను సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నేడు ఉదయం సచివాలయంలో డా, హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ తోపాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. గా భాద్యతలను స్వీకరించారు.           స్పెషల్ కమీషనర్ గా భద్యతలు స్వీకరించిన ప్రియాంక కు సమాచార శాఖ, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జెన్కో ఎం.డి గా వెళ్లిన డా. హరీష్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై ...

తిరుమలాయపాలెం మండలంలో రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన

Image
వారం రోజుల్లో రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు అందజేస్తామని రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం గత పాలకుల సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బి.టి రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల 15 లక్షలతో బచ్చోడు నుండి ఉర్లగొండ డొంక వరకు , రూ.2 కోట్ల 42 లక్షలతో రాజారాం నుండి జూపెడ వరకు  2.2 కిలోమీటర్ల పొడవు, రూ.కోటి 83 లక్షలతో సోలిపురం నుండి హలావత్ తండా వరకు , రూ.3 కోట్ల 15 లక్షలతో పీక్యా తండా నుండి కాకరవాయి వరకు 3 కిలో మీటర్ల మేర నిర్మించనున్న బి.టి రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు.అనంతరం సోలిపురం గ్రామంలో ఉన్న హజ్రత్ మన్సూర్ షావలి దర్గాను దర్శించుకొని చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..4 రోజులలో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ప్రస్తుత సీజన్ ముగిసే లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా...

వికసిత భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు: మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్

Image
పేదల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత సి. కృష్ణయాదవ్ తెలిపారు. శనివారం రాత్రి బాగ్ అంబర్‌పేట్ డివిజన్‌లోని రెడ్ బిల్డింగ్ చౌరస్తాలో నిర్వహించిన *'వికసిత భారత్ సంకల్ప సభ'*లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో మోదీ సర్కార్ చేపట్టిన పాలన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిందని ఆయన అన్నారు. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, సామాజిక న్యాయం అందేలా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. కేంద్ర పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి, నాయకులు నాగరాజు చారి, కృష్ణగౌడ్, అజయ్ కుమార్, రాఘవేంద్ర చారి, అచ్చిని రమేష్, ధనుంజయ్, బాలు తదితరులు పాల్గొన్నారు.  

చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్‌పై ఫిర్యాదు

Image
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయవాది మరియు టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ దొనేటి భాను చందర్ శనివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — "ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా మరియు శాసనబద్ధ ప్రజాపాలనను అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. కాబట్టి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి," అని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అభిషేక్ కెనడీ, నర్సింగ్ రావు, గుండు జగదీశ్‌బాబు, నరేందర్ యాదవ్, గుర్రం దినేష్, మజర్, హాఫీజ్, దినేష్, ముష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.  

గ్రామీణ సంపదకు నిలయం 'మూలం' సంత

Image
తార్నాకలోని మర్రి చెన్నారెడ్డి హాల్లో శనివారం నిర్వహించిన 12వ మూలం సంతకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామభారతి మరియు సీఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 75 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ మాట్లాడుతూ — "ప్రకృతి ఆధారిత గ్రామీణ ఉత్పత్తుల సమాహారమే మూలం సంత. గ్రామీణ వ్యవసాయాన్ని, గోఆధారిత జీవనాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సంతను నిర్వహిస్తున్నాం," అని తెలిపారు. రైతులు తయారు చేసిన ప్రకృతి ఉత్పత్తులను ఆదరించాలని, నగర ప్రజలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్వదేశీ జీవనాన్ని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో గ్రామభారతి ఉపాధ్యక్షులు ఉట్నూరి లింగం గౌడ్, రాజమౌళి, సంయుక్త కార్యదర్శి బండి సురేష్ గౌడ్, శివకుమార్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుంది

Image
 యువత, మహిళలకు తెలంగాణ జాగృతి రాజకీయ శిక్షణా వేదిక ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దు... ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాయకత్వ శిక్షణా కార్యక్రమాలు “లీడర్” పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : యువత, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని, రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించేతత్వం గల గడ్డ అని, ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో “లీడర్” పేరిట నిర్వహించబోయే రాజకీయ శిక్షణా తరగతుల పోస్టర్ ను ఆదివారం నాడు తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... తెల...

రాష్ట్రంలో సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించండి..

Image
* సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జ‌యంత్ చౌద‌రి సూచ‌న‌ * ఐటీఐల‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని విజ్ఞ‌ప్తి * స్కిల్ యూనివ‌ర్సిటీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరిన సీఎం * ఐటీఐల సిల‌బ‌స్ అప్‌గ్రేడ్‌కు క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం  హైద‌రాబాద్‌:  రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువ‌ల్స్ రంగాల‌కు సంబంధించి సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జ‌యంత్ చౌద‌రి సూచించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో ఆయ‌న నివాసంలో కేంద్ర మంత్రి జ‌యంత్ చౌద‌రి ఆదివారం స‌మావేశ‌మ‌య్యారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తాము ప్రారంభించిన‌ యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీలో సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసి.. దానిని ఐటీఐల‌ను అనుసంధానిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంపై ముఖ్య‌మంత్రిని కేంద్ర మంత్రి అభినందించారు. జాతీయ నైపుణ్య శిక్ష‌ణ కింద యంగ్ ఇండియ...

విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా తెలంగాణ ప్రభుత్వం

Image
  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో  MOU కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో MOU కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ.   జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​  సదుపాయాలను అందించనున్న ప్రభుత్వం.  ఇందుకు నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో ఈరోజు MOU కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ.  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని భావిస్తున్న ప్రభుత్వం.  రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం....

June 15th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image