Posts

Showing posts from July, 2025

August 1st, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 30th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

మహిళల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం

Image
 మహిళల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం ఎన్ హెచ్ ఆర్ సి సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) వివిధ శాఖల అధికారులతో మంగళవారం నాడు సమావేశమైంది.  గౌరవనీయ చైర్‌పర్సన్ శ్రీ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, గౌరవ సభ్యులు శ్రీమతి విజయ భారతి సయానీ, డా.జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, టి ఎస్ హెచ్ ఆర్ సి  గౌరవ చైర్మన్ జస్టిస్ శ్రీ షమీమ్ అక్తర్, సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్), శ్రీ ఆర్ . ప్రసాద్ మీనా, రిజిస్ట్రార్ (లా) డిప్యూటీ శ్రీ జోగిందర్ సింగ్ తదితరులు జాతీయ మానవ హక్కుల కమిషన్  నుండి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మహిళలపై నేరాలు అనే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా డిజిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో  ఉమన్ సేఫ్టీ వింగ్ పనిచేస్తుందన్నారు. వివిధ ప్రాంతాలకు చెందినవారు హైదరాబాద్ లో...

July 29th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 27th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 25th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 24rd, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 23rd, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 22nd, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 20th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 19th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 18th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

ఖైదీల ఎస్కార్ట్ వ్యవస్థ బలోపేతానికి డీజీపీ కార్యాలయంలో సమీక్ష: సమన్వయానికి కొత్త మార్గదర్శకాలు

Image
 డిజిపి  కార్యాలయంలో ఖైదీల ఎస్కార్ట్ పై గురువారం నాడు ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఖైదీల ఎస్కార్ట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమైన మార్గదర్శకాలను  శాంతి భద్రతల అదనపు డిజిపి  మహేష్ ఎం. భగవత్ జారీ చేశారు. నూరు శాతం  ఖైదీల ఎస్కార్ట్ ను సమర్ధంగా చేసిన  వారిని వ్యక్తిగతంగా అభినందించారు.  ఇతర రాష్ట్రాలతో సమన్వయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఎస్కార్ట్ అభ్యర్థనల కోసం రేడియో సందేశాలు కనీసం ఒక వారం ముందే పంపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది మెరుగైన ప్రణాళికకు దోహదపడుతూ, చివరి నిమిషపు లాజిస్టికల్ సమస్యలను నివారించగలదని అన్నారు. అన్ని సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం, లా అండ్ ఆర్డర్, సి ఏ ఆర్, జైళ్లు, కోర్టు అనుసంధానం విభాగాల అధికారులతో కలిసి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఖైదీల ఎస్స్కార్టు తేదీలు, సమయాలు, ఎస్కార్ట్ ఏర్పాట్లపై తక్షణ సమాచారం మార్పిడి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాలో బయట ఖైదీ ఎస్కార్ట్ శాతం తక్కువగా ఉండే యూనిట్లపట్ల ఆందోళన వ్యక్తం చేసి...

భారత్ నేతృత్వంలో ఏఐ-ఆధారిత ఆవిష్కరణలతో గ్లోబల్ క్రియేటివ్ ఎకానమీ : సంజయ్ జాజు

Image
 భారత్ నేతృత్వంలో ఏఐ-ఆధారిత ఆవిష్కరణలతో గ్లోబల్ క్రియేటివ్ ఎకానమీ : సమాచార-ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు దేశవ్యాప్తంగా ప్రతి భాషలో ప్రతి ఒక్కరికీ సమగ్ర సమాచారాన్నిఅందించడానికి భాషాపరమైన అంతరాలను తగ్గించే ఏఐ-ఆధారిత పరిష్కారాలను అమలు చేసే దిశగా  సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఏఐ/ఎమ్ఎల్-ఆధారిత సాంకేతిక పరిష్కారాల కోసం కృషిచేస్తున్న ఇంక్యుబేటర్లు, అంకుర సంస్థలతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి  సంజయ్ జాజు ఈరోజు హైదరాబాద్‌లోని టి-హబ్‌ లో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో టి-హబ్‌ సీఈఓతో పాటు, టి-హబ్‌లో వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అంకుర సంస్థలు, ఐఐటీ హైదరాబాద్, ఎన్‌ఐటీల ఎక్సలెన్స్ సెంటర్ల ప్రతినిధులు, ఇంజినీరింగ్ విద్యాసంస్థలలో  క్రియాశీల ఆవిష్కరణ విభాగాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జాజు మాట్లాడుతూ.. దేశంలోని క్రియేటివ్ ఎకానమీని ప్రోత్సహించాలనే గౌరవ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ వేదికను ఏర్పాటు చేసిందన్నారు. భవిష్యత్తుకు సన్నద...

July 17th, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 16th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

రామంతపూర్ భగయత్ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Image
 రామంతపూర్ భగయత్ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి                                                           రామంతాపూర్ భగయత్, వెంకట సాయి నగర్ కాలనీ సర్వే నెంబర్ 40 ,40/A  బీరప్ప దేవాలయం వెనకాల లైన్ లో  సాంక్షన్ అయి ప్రారంభోత్సవం జరగాల్సినటువంటి   బ్రిడ్జ్ స్థలాన్ని ఈరోజు కాలనీవాసులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ బాక్స్ కల్వర్టు పనులను వచ్చేవారంలో ప్రారంభిస్తానని వాటితోపాటు కాలనీలో డ్రైనేజీ లైన్లు సీసీ రోడ్లు సాంక్షన్ చేయిస్తానని  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంధం నాగేశ్వరరావు, సర్వే సత్తయ్య యాదవ్, రమేష్ గౌడ్ , ఎ .విజయేందర్ రెడ్డి, శంకర్, రమేష్ యాదవ్, హుస్సేన్, శివ యాదవ్, ఐలేష్ యాదవ్, గోపాల్,అశోక్, గోవింద్, శీను, పరశురాం, కీర్తి తదితరులు పాల్గొన్నారు

July 15th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 14th, Monday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 13th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

ఉప్పల్ మినీ శిల్పారామం లో "హస్తకళల థీమాటిక్ ఎక్సిబిషన్" ఘనంగా ప్రారంభం

Image
 ఉప్పల్ మినీ శిల్పారామం లో "హస్తకళల థీమాటిక్ ఎక్సిబిషన్" ఘనంగా ప్రారంభం హైదరాబాద్, జూలై 12: TOOFAN  ఉప్పల్ మినీ శిల్పారామంలో పది రోజులపాటు నిర్వహించబోయే "హస్తకళల థీమాటిక్ ఎక్సిబిషన్" ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి శృతి పాటిల్ ఐఐఎస్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, శ్రీమతి సువర్చలా, అసిస్టెంట్ డైరెక్టర్, అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు), మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, భారత ప్రభుత్వం, శ్రీ జి. కిషన్ రావు, ఐఏఎస్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్, శ్రీ దోశాడ కృష్ణచారి గారి, నేషనల్ అవార్డు గ్రహీత (సిల్వర్ ఫిలిగ్రి) మరియు శ్రీ విజయసాగర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, ఏపిపిసి పాల్గొన్నారు. ముఖ్య అతిథులు ఎక్సిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ హస్తకళా స్టాల్స్‌ను సందర్శించి, కళాకారుల పనితీరును ప్రశంసించారు. వారు తయారు చేస్తున్న వస్తువుల తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కళాకారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు శిక్షణలు పొందినవారు, తమ ఉత్పత్తులను అమ్ముతూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ సం...

July 12th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

అంబులెన్సు సేవలు ప్రారంభం : ఎస్పీ రోహిత్ రాజు

Image
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చర్ల మండలం పూసగుప్ప గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మితమైన మొబైల్ హాస్పిటల్ మరియు అంబులెన్సు సేవలు ప్రారంభం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన పూసుగుప్పలో ఈ రోజు మొబైల్ హాస్పిటల్ మరియు అంబులెన్స్ సేవలను ప్రారంభించడం జరిగింది.భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారితో పాటు, జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్,ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ లు పాల్గొన్నారు.స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ నిధుల ద్వారా విడుదలైన కోటి రూపాయల వ్యయంతో ఈ మొబైల్ హాస్పటల్ ను నిర్మించడం జరిగింది. చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి సారథ్యంలో పోలీస్ శాఖ విశేష సేవలను అందిస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు  ఈ సందర్భంగా అన్నారు.  పూసుగుప్ప గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే భద్రాచలం,కొత్తగూ...

సుప్రీం కోర్ట్ సి.జె. జస్టిస్ గవాయ్ కు ఘన స్వాగతం పలికిన సి.ఎస్, డీజీపీ లు

Image
 సుప్రీం కోర్ట్ సి.జె. జస్టిస్ గవాయ్ కు ఘన స్వాగతం పలికిన సి.ఎస్, డీజీపీ లు       హైదరాబాద్, జూలై 11(తూఫాన్‌) :  రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  భూషణ్ రామకృష్ణ గవాయ్ కు శుక్ర‌వారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. షంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తో పాటు సుప్రీం కోర్ట్ జడ్జి జస్టిస్ పగిడిగంటం  నర్సింహా లకు రాష్ట్ర హై కోర్టు ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, డీజీపీ డా. జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి, ఏ.జి. సుదర్శన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు

జూబ్లీహిల్స్ నియోజక వర్గం లో రూ. 5.12 కోట్ల అంచనా వ్యయం తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Image
  జూబ్లీహిల్స్ నియోజక వర్గం లో రూ. 5.12 కోట్ల అంచనా వ్యయం తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రజా పాలన ప్రభుత్వం లో హైదరాబాద్ లోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పై ప్రణాళిక.. జూబ్లిహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతాం. ప్రజా పాలన ప్రభుత్వాన్ని ఆస్వాదించండి .. అండగా ఉండండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి హైదరాబాద్,జూలై 11:    జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 5.15 కోట్ల రూపాయల తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్,వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు.  షేక్ పేట్ వార్డులో 315.90 లక్షల వ్యయం తో చేపట్టనున్న ఫ్లైఓవర్ క్రింద స్పోర్ట్స్ పార్క్ కి , కమ్యూనిటీ  డెవలప్మెంట్  , ఫుట్ పాత్ తో పాటు హరిజన బస్తీ వద్ద  సి సి రోడ్లు  నిర్మాణాలకు   శంకుస్థాపనలు చేశారు. ఇక వెంగల్ రావు నగర్ వార్డు లో గురుద్వార్ కమాన్ వద్ద 100 .5 లక్షల వ్యయం తో  చేపట్టనున్న  సిసి రోడ్ల  నిర్మాణాలకు శంకుస్ధాపన చేశారు.  అనంతరం ...

July 10th, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 9th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

నెహ్రూ జూలాజికల్ పార్కులో “వనమహోత్సవం” ఘనంగా ప్రారంభం

Image
 తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పర్యావరణ కార్యక్రమంగా నిలిచిన “వనమహోత్సవం” ఈ రోజు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టెలంగాణ జూ పార్క్స్ డైరెక్టర్ డా. సునీల్ ఎస్. హిరేమత్, ఐఎఫ్ఎస్ , మరియు క్యూరేటర్  జె. వసంత , జూ సిబ్బంది పాల్గొని మొత్తం 250 చెట్లను నాటారు . ఈ సందర్భంగా డా. సునీల్ హిరేమత్ మాట్లాడుతూ, నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను “హైదరాబాద్ ఆకుపచ్చ ఊపిరితిత్తులు” అని పేర్కొన్నారు. ఇది నగర ప్రజలకు పచ్చదనం, ప్రశాంతతను అందించే ప్రదేశంగా విశేషంగా పేరుపొందిందని, దేశంలోనే అగ్రశ్రేణి జంతు ప్రదర్శనశాలల్లో ఒకటిగా సందర్శకుల అభిప్రాయం పొందిందన్నారు. క్యూరేటర్ జె. వసంత, ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ, నెహ్రూ జూ పార్క్ వన్యప్రాణులు, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రతి పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. అంతేకాక, జూ సిబ్బందిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ తమ నివాస ప్రాంగణంలో కనీసం రెండు చెట్లు నాటి, వాటిని తమ పిల్లలలాగా పరిరక్షించాలి” అని సూచ...

కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధుల విడుదల – ఈటల రాజేందర్

Image
  కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధుల విడుదల – ఈటల రాజేందర్ హైదరాబాద్, కంటోన్మెంట్: కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్ అభివృద్ధికి భారీ నిధులను విడుదల చేసినట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో జూబ్లీ బస్ స్టేషన్‌ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం అవసరమైన రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. భూమి బదిలీకి బదులుగా కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సిన రూ.303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకే మళ్లించాలని బోర్డు తీర్మానం చేసినట్లు ఈటల పేర్కొన్నారు. ఈ మేరకు తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాసినట్టు తెలిపారు. పార్లమెంట్‌లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. ఈ లేఖలు, బోర్డు తీర్మానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర రక్షణ శాఖ తాజాగా రూ.303 కోట్లను కంటోన్మెంట్ బోర్డు ఖాతాలోకి నేరుగా జమచేసినట్లు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈటల తెలిపారు. అదనంగా రూ.11 కోట్ల గ్రాంట్‌ను కూడా విడుదల చేసినట్టు పేర్కొన్నారు. వర్షపు నీరు, డ్రైనేజ్ కు భారీ ప్రాజెక్టులు ఈ నిధు...

హజ్ 2026కు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన హజ్ కమిటీ ఆఫ్ ఇండియా

Image
 హజ్ 2026కు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2025, జులై 31 ముస్లిం సమాజంలో అత్యంత పవిత్ర తీర్థయాత్ర అయిన హజ్ 2026కు దరఖాస్తు ప్రక్రియను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రారంభించింది. హజ్‌కు వెళ్లాలని భావిస్తున్న యాత్రికులు  https://hajcommittee.gov.in   పోర్టల్ లేదా ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘‘హజ్ సువిధ’’ మొబైల్ అప్లికేషన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. 2025 జులై 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూలై 31 రాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ ఫారాలను సమర్పించే ముందు మార్గనిర్దేశకాలు, విధివిధానాలను పూర్తిగా చదవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీన లేదా అంతకు ముందే జారీ చేసి, 2026 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటయ్యే మెషీన్ చదవగలిగిన అంతర్జాతీయ భారత పాస్‌పోర్టును కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ముందు వారి సన్నద్ధతను పరిగణనలోకి తీసుకోవాలని యాత్రికులకు హజ్ కమిటీ సూచించింది. దురదృష్టవశాత్తూ సంభవించిన మరణం లేదా తీవ్రమైన అన...

కళా సేతు, భాషా సేతు : పోటీలకు దరఖాస్తులకు ఆహ్వానం

Image
  జాతీయ స్థాయిలో ‘కళా సేతు’ పోటీలను ప్రారంభించిన స్టార్టప్ యాక్సిలేటర్ వేవ్‌ఎక్స్: ప్రజలందరికీ పరిపాలనను చేరువ చేసేలా బహుళ భాషల్లో మల్టీ మీడియా కంటెంట్ రూపొందించే పరిష్కారాలను ఆవిష్కరించాల్సిందిగా ఏఐ ఆధారిత అంకుర సంస్థలకు ఆహ్వానం భారతీయ భాషల్లో ఇచ్చిన సారాంశం ఆధారంగా మల్టీ మీడియా కంటెంట్ రూపొందించే ఏఐ టూల్స్‌ను తయారు చేయాలని అంకుర సంస్థలకు సవాలు విసిరిన ‘కళా సేతు’ బహుభాషా కంటెంట్‌లో ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించే కళా సేతు, భాషా సేతు : పోటీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలు వరుసగా జులై 30, జులై 22 డిజిటల్ పాలనను భారత్ వేగవంతం చేస్తున్న తరుణంలో.. ప్రజలకు వారి భాషలోనే వేగంగా, సమర్థవంతంగా సమాచారాన్ని అందించడం చాలా కీలకంగా మారింది. ప్రజలను చేరుకోవడంలో స్థాయిని, వేగాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో సంప్రదాయ కంటెంట్ విధానానికి పరిమితులు ఉన్నాయి. సమ్మిళితమైన, సాంకేతిక ఆధారిత సమాచారాన్ని అందించాలనే ప్రభుత్వం అంకితభావానికి అనుగుణంగా ఏఐ ఆధారిత పరిష్కారాలను స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇవి భాషాపరమైన అవరోధాలను అధిగమించి చివరి వ్యక్తి వరకు సమాచారాన్ని చేరవేస్తాయి. కళా సేతు: రియల్ టైం లాంగ్వేజ్...

నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

Image
   నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ లాంగ్ ఆర్మ్ జేసీబీ పనితీరు పరిశీలన వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మంగళవారం పరిశీలించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 వద్ద చింతలబస్తీ ఆరంభంలో ఉండే కల్వర్టును పరిశీలించారు. ఈ కల్వర్టు 12 మీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. చింతలబస్తీ వైపు కబ్జాలను తొలగించిన విషయం విధితమే. 6 మీటర్ల మేర కబ్జాకు గురి అవ్వడంతో కల్వర్టు కింద భారీగా చెత్తపోగై వరద సాగడానికి వీలు లేని పరిస్థితి నెలకొంది. అక్కడ చెత్తను తొలగించడానికి లాంగ్ ఆర్మ్ జేసీబీని వినియోగించిన తీరును పరిశీలించారు. ఇదే మాదిరి నగరంలోని ప్రధాన కల్వర్టుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. అంతకు ముందు కృష్ణ నగర్లో నాలాల తీరును క్షేత్రస్థాయిలో7 పరిశీలించారు. వరద ముంచెత్తడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నివారణకు ఇటీవల కొత్తగా 3 మీటర్ల వెడల్పుతో నిర్మించిన వరద కాలువ మధ్యలో ఎందుకు ఆగిపోయిందో విచారించారు. కృష్ణానగర్ ప్రధాన దారిని దాటించడానికి ఉన్న అవరోధాలపై వాకబు చేశారు. పై నుంచి ఎంత వెడల్పుతో వస్తుందో అంతే స్థాయిలో బాక్సు డ్రైన్లన...

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి

Image
  లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి హైదరాబాద్‌, మాధాపూర్‌: జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఫిర్యాదుదారుడిని నుంచి లంచం తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అనిశా (ACB) అధికారులకు ఓ ప్రభుత్వ అధికారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.  మాధాపూర్‌ ప్రాంతానికి చెందిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి ఎం. సుధ ఓ కంపెనీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసి, నంబర్‌ జారీ చేయడానికి సంబంధించి ఫిర్యాదుదారుడిని నుంచి రూ.8,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ మంగళవారం సాయంత్రం అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే, లంచం ఇవ్వడం తల్లడిల్లిన బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. వారి పర్యవేక్షణలో నిర్వహించిన వలలో ఎం. సుధ లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిశా అధికారులు వెల్లడించారు.

July 8th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

నల్లగొండలో డిప్యూటీ తహశీల్దార్ అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

Image
 నల్లగొండలో డిప్యూటీ తహశీల్దార్ అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నల్లగొండ, జూలై 7: జిల్లాలోని పౌర సరఫరాల శాఖకు చెందిన మిర్యాలగూడ విభాగంలో పని చేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ షేక్ జావీద్‌ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాజా వివరాల ప్రకారం, స్వాధీనపరచుకున్న మూడు వాహనాలపై పంచనామా నిర్వహించి, గౌరవ న్యాయస్థానానికి నివేదిక పంపించి వాటి విడుదల కోసం ఉత్తర్వులు తీసుకొచ్చేందుకు సంబంధించి, ఫిర్యాదుదారు సహాయాన్ని కోరాడు.  అయితే, ఈ పని చేసేందుకు మొదట రూ. 1,00,000/- లంచం డిమాండ్ చేసిన షేక్ జావీద్, తర్వాత చర్చల అనంతరం దాన్ని రూ. 70,000/- కు తగ్గించాడు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు ACBను ఆశ్రయించగా, అధికారులు 07.06.2025న లంచం స్వీకరిస్తున్న సమయంలో షేక్ జావీద్‌ను పట్టుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతని నివాసంలో మరియు కార్యాలయంలో శోధనలు నిర్వహించినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్ విధించారు. రాష్ట్రంలో అధికారుల అవినీతి అడ్డుకునేందుకు ACB చర్యలు కొనసాగిస్...

తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో

Image
 తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో. * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్‌. * యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌. ఢిల్లీ:  తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న అధికారిక నివాసంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ సోమవారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సినీ నిర్మాణంలో కీల‌క‌మైన యానిమేష‌న్‌,  వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇత‌ర స‌దుపాయాల‌తో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన‌ స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు.  అంత‌ర్జాతీయ స్థాయి  స్టూడియో నిర్మాణంతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో వివిధ విభాగాల‌కు అవ‌స‌ర‌మైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజ‌య్ దేవ‌గ‌ణ్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అభివృద...

July 27th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 6th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 5th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

కోటపల్లి తహశీల్దార్ కార్యాలయంలో లంచం కలకలం: డిప్యూటీ తహశీల్దారు, అటెండర్ అరెస్టు

Image
కోటపల్లి తహశీల్దార్ కార్యాలయంలో లంచం కలకలం: డిప్యూటీ తహశీల్దారు, అటెండర్ అరెస్టు   మంచిర్యాల, జూలై 4:(TOOFAN)  రెవెన్యూ రికార్డుల్లో పేరును అనుసంధానించి, పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేయాలనే నిమిత్తం ఫిర్యాదుదారుని నుండి రూ.10,000 లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా కోటపల్లి తహశీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహశీల్దారు ఆకిరెడ్డి నవీన్ కుమార్, అటెండర్ గవిడి అంజన్న Telangana ACB (అనిశా) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి తండ్రి (పట్టాదారు) ఆధార్‌ను రెవెన్యూ ఖాతాతో అనుసంధానించి, సంబంధిత పత్రాలను ప్రాసెస్ చేసి, ఉన్నతాధికారులకు పంపించేందుకు మరియు చివరికి పాసుపుస్తకం జారీ చేయడానికే అధికారులు లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. తండ్రి అనారోగ్యం కారణంగా అతని తరుపున అటెండర్‌గా పనిచేస్తున్న గవిడి అంజన్న కూడా ఈ వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నాడు. ఫిర్యాదుదారుడి నుంచి వచ్చిన సమాచారంపై స్పందించిన రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ ఏర్పాటు చేసి, డిప్యూటీ తహశీల్దారు, అటెండర్‌ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధిక...

అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్

Image
  అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్ హైదరాబాద్, జూలై 04(TOOFAN):    అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. శుక్రవారం  గ్రేటర్ లో సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మెడికల్ అండ్ హెల్త్, అనుబంధ శాఖల అధికారులతో కమీషనర్ ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్,  సుభద్ర, చీఫ్ మెడికల్  హెల్త్ అధికారి డాక్టర్ పద్మజ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్  వెంకన్న, డాక్టర్ ఉమా, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్  జె వెంకటేశ్వరరావు, ఐ ఐ సి టి  సైంటిస్ట్ కె.లక్ష్మీ నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ మాట్లాడుతూ... జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో  సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్  వ్యాధుల ...