ఉప్పల్ మినీ శిల్పారామం లో "హస్తకళల థీమాటిక్ ఎక్సిబిషన్" ఘనంగా ప్రారంభం
ఉప్పల్ మినీ శిల్పారామం లో "హస్తకళల థీమాటిక్ ఎక్సిబిషన్" ఘనంగా ప్రారంభం
హైదరాబాద్, జూలై 12: TOOFAN
ఉప్పల్ మినీ శిల్పారామంలో పది రోజులపాటు నిర్వహించబోయే "హస్తకళల థీమాటిక్ ఎక్సిబిషన్" ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి శృతి పాటిల్ ఐఐఎస్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, శ్రీమతి సువర్చలా, అసిస్టెంట్ డైరెక్టర్, అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు), మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, భారత ప్రభుత్వం, శ్రీ జి. కిషన్ రావు, ఐఏఎస్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్, శ్రీ దోశాడ కృష్ణచారి గారి, నేషనల్ అవార్డు గ్రహీత (సిల్వర్ ఫిలిగ్రి) మరియు శ్రీ విజయసాగర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, ఏపిపిసి పాల్గొన్నారు.
ముఖ్య అతిథులు ఎక్సిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ హస్తకళా స్టాల్స్ను సందర్శించి, కళాకారుల పనితీరును ప్రశంసించారు. వారు తయారు చేస్తున్న వస్తువుల తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కళాకారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు శిక్షణలు పొందినవారు, తమ ఉత్పత్తులను అమ్ముతూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ సందర్భంలో శ్రీమతి శృతి పాటిల్ గారు మాట్లాడుతూ, "మన సంప్రదాయ కళలకు స్థిరమైన ప్రోత్సాహం అవసరం. ఈ కళలను కొనసాగించాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం," అని అన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా, ఈరోజు శ్రీమతి పావని శ్రీలత గారి శిష్యులు కూచిపూడి నృత్య ప్రదర్శన అందించారు, ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ ఎక్సిబిషన్, అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు), మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గోవెర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక సహకారంతో, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్, హైదరాబాద్ వారి నిర్వహణలో జూలై 12 నుండి 21వ తారీకు వరకు జరుగుతుంది.
ఇందులో 50 మంది హస్తకళాకారులు పాల్గొంటున్నారు. కొండపల్లి బొమ్మలు, నరసాపురం లేసు, చేర్యాల పెయింటింగ్స్, సవర పెయింటింగ్స్, లక్క బొమ్మలు, పామ్ లీఫ్ క్రాఫ్ట్, బోబిన్ లేస్ వంటి అనేక హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు అమ్మకాలూ జరుగుతాయి. ప్రతి రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందర్శకులకు ఆకర్షణగా నిలవనున్నాయి.
Comments
Post a Comment