Posts

Showing posts from May, 2018

వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం – మంత్రి కెటి రామారావు

Image
వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం – మంత్రి కెటి రామారావు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. నగరంలో ఇళ్ల నిర్మాణ చాల వేగంగా నడుస్తున్నదని మంత్రి తెలిపారు.   మెత్తం 109 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈరోజు బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో నగర మేయర్, కమీషనర్, ఇతర ఉన్నతాధికారులతో నగరంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని సమీక్షించారు. జియచ్ యంసి తరపున ఇళ్ల నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇళ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రికి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వేగంతో ముందుకు వెళ్తే వచ్చే డిసెంబర్ నాటికి సూమారు 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతున్నదని అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం వచ్చే   ఏడాది జూన్ మాసం నాటికి పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణంలో స్థానిక యంఏల్యేలు, యంపిలను   మరింత భాగస్వాములను చేయడం ద్వారా పర్యవేక్షణ,...
Image
*పేద ముస్లింల‌కు రంజాన్ గిఫ్టు ప్యాక్‌ల పంపిణీ*    రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకొని నిరుపేద ముస్లింల‌కు నూత‌న వ‌స్త్రాల‌తో కూడిన గిఫ్టు ప్యాకెట్ల‌ను బోర‌బండ డివిజ‌న్‌లోని భ‌ర‌త్‌న‌గ‌ర్‌, సైట్‌-3 వీక‌ర్ సెక్ష‌న్ కాల‌నీలో డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ నేడు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ స‌ల‌హదారు ఎ.కె.ఖాన్‌, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌లు ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక అతిథులుగా హాజ‌ర‌య్యారు. భ‌ర‌త్‌న‌గ‌ర్‌లోని హీర మ‌జీద్‌లో, సైట్‌-3లోని అమీనా మ‌జీద్‌ల‌లో ఈ గిఫ్టు ప్యాక్‌ల పంపిణీ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డిప్యూటి మేయర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌ర‌మే కాకుండా రాష్ట్రంలోనే ముందుగా పేద ముస్లింల‌కు నూత‌న వ‌స్త్రాల పంపిణీ కార్య‌క్ర‌మం బోర‌బండ డివిజ‌న్‌లో నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ న‌గ‌రంలోని పేద ముస్లీంల‌కు గిఫ్టు ప్యాక్‌లను పంపిణీ చేయ‌డానికి సంబంధిత మ‌జీద్ క‌మిటీల‌కు అంద‌జేశామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హదారు ఎ.కె.ఖాన్ మాట్లాడుతూ  రంజాన్ పండుగ సంద‌ర్భంగా నిరుపేద‌ల‌కు దుస్తుల పంపిణీతో పాటు విందుభోజ‌నం ...

*స‌ఫాయి క‌ర్మ‌చారుల సంక్షేమానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు - జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ ఛైర్మ‌న్ వ‌జీభాయ్*

Image
*స‌ఫాయి క‌ర్మ‌చారుల సంక్షేమానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు - జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ ఛైర్మ‌న్ వ‌జీభాయ్*    స‌మాజాన్ని స్వ‌చ్ఛంగా ఉంచేందుకు కృషిచేసే స‌ఫాయి కార్మికుల సంక్షేమానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల్సిందిగా జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ ఛైర్మ‌న్ మ‌న్హ‌ర్ వ‌జీభాయ్ జాల అధికారులకు సూచించారు. సఫాయి క‌ర్మ‌చారిల సంక్షేమంపై  చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో స‌మీక్షించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, జ‌ల‌మండ‌లి ఎండి దానకిషోర్‌, జీహెచ్ఎంసీ జ‌ల‌మండ‌లి కార్యాల‌యాల ఉన్న‌తాధికారులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జాతీయ క‌ర్మ‌చారి క‌మీష‌న్ ఛైర్మ‌న్ మ‌న్హ‌ర్ వ‌జీభాయ్ జాల మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రం సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో దేశంలోని ప్ర‌ధాన నగ‌రాల క‌న్నా అగ్ర‌స్థానంలో నిల‌వ‌డం ప‌ట్ల అభినందిస్తూ దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మైన పారిశుధ్య కార్మికులకు ఈ ఘ‌న‌త ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. దేశాన్ని సైనికుడు ఎలా ర‌క్షిస్తాడో స‌మాజాన్ని స్వ‌చ్చంగా ఉంచ‌డానికి స‌ఫాయి కార్మికులు నిస్వార్థంగా ప‌నిచేస్తార‌ని అన్నారు. గతంతో పోలిస్తే హైద‌రాబాద్ న‌గ...

జల సౌధలో ఎన్.ఎస్. పీ లిఫ్ట్ ఇరిగేషన్ పై మంత్రి హరీష్ రావు సమీక్ష

Image
జల సౌధలో   ఎన్.ఎస్. పీ లిఫ్ట్ ఇరిగేషన్ పై మంత్రి హరీష్ రావు సమీక్ష.   దిండి ఎత్తిపోతల పథకం తొలి ఫలాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు ఆదేశం. సమీక్షలో పాల్గొన్న నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాల గూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు.   ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ హైలెవల్ కెనాల్ - 8 , 9 లో 23 కిలోమీటర్ల తర్వాత దాదాపు ఎనిమిది వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని అధికారులు ఈ సమీక్షలో మంత్రి హరీష్ రావుకు తెలిపారు. చలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2 వేల ఎకరాల ఆయకట్టుకు డీప్ కట్ ఉండటం ద్వారా నీటి పంపింగ్ లో అంతరాయం కలుగుతోందని వివరించారు. దీన్ని అధిగ మించేందుకు లో లెవల్ కెనాల్ పంప్ హౌస్ లోని మూడు పంపుల్లో... ప్రత్యామ్నాయంగా ( స్టాండ్ బై) ఉన్న పంపు ఉపయోగించి డి- 8,9 కు అనుసంధానం చేసేలా ప్రతిపాదనలు పంపాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.   ఎన్. ఎస్. పీ పుట్టంగండి నుంచి అక్కంపెల్లి బాలెన్సింగ్   రిజర్వాయర్ కు గల 9.3 కిలోమీటర్ల లింక్ కెనాల్ , అక్కడి నుంచి కోదండాపూర్ రిజర్...

విజేత‌గా వ‌స్తున్న క‌ళ్యాణ్ దేవ్..

Image
విజేత‌గా వ‌స్తున్న క‌ళ్యాణ్ దేవ్..  మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న తొలి చిత్రానికి విజేత టైటిల్ ఖ‌రారు చేసారు. 1985లో చిరంజీవి న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు అల్లుడు కూడా ఇదే టైటిల్ తో ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. లైటింగ్ అప్ స్మైల్స్ ఆన్ అద‌ర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఎ స‌క్సెస్ అనేది ట్యాగ్ లైన్. అంటే ఇత‌రుల మొహాల్లో వెలుగు చూడ‌టం కూడా విజ‌య‌మే అని అర్థం. అందుకే క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఈ చిత్రానికి విజేత అనే టైటిల్ పెట్టారు. సాయి కొర్ర‌పాటి వారాహి  సంస్థ‌లో ర‌జినీ కొర్ర‌పాటి నిర్మాత‌గా విజేత వ‌స్తుంది. రాకేశ్ శశి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. మాళ‌విక న‌య్య‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ మ‌ధ్యే డ‌బ్బింగ్ కూడా మొద‌లు పెట్టారు హీరో క‌ళ్యాణ్ దేవ్. బాహుబ‌లి ఫేమ్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌టం విశేషం. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ విజేత‌. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ దేవ్ తో పాటు మాళ‌విక న‌య్య‌ర్, నాజ‌ర్, త‌ణిక...

*కృష్ణాన‌ది పున‌రుజ్జీవ‌నం పైనే న‌గ‌ర భ‌విష్య‌త్ - మేయ‌ర్ రామ్మోహ‌న్‌*

Image
*కృష్ణాన‌ది పున‌రుజ్జీవ‌నం పైనే న‌గ‌ర భ‌విష్య‌త్ - మేయ‌ర్ రామ్మోహ‌న్‌*   రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌ర భ‌విష్య‌త్తు అవ‌సరాల దృష్ట్యా కృష్ణాన‌ది పున‌రుజ్జీవ‌న అత్యంత ఆవ‌శ్య‌మ‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణ జ‌ల‌వ‌న‌రుల అభివృద్ది సంస్థ ఆధ్వ‌ర్యంలో కృష్ణాన‌ది పున‌రుజ్జీవ‌నం అనే అంశంపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీర్స్‌లో జ‌రిగిన స‌ద‌స్సులో మేయ‌ర్ రామ్మోహ‌న్ పాల్గొన్నారు. సంస్థ ఛైర్మ‌న్ వి.ప్ర‌కాశ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌ద‌స్సులో మేయ‌ర్ రామ్మోహ‌న్ మాట్లాడుతూ హైద‌రాబాద్ స‌హా తెలంగాణ‌లోని స‌గ‌భాగం కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఉంద‌ని, ఇందుకుగాను రాష్ట్ర అవ‌స‌రాల నిమిత్తం కృష్ణాన‌ది పున‌రుజ్జీవ‌నానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. తెలంగాణ జీవ‌న ప్ర‌మాణాల పెంపు, హైద‌రాబాద్ న‌గ‌రం ఆర్థికంగా, పారిశ్రామిక అభివృద్ది కృష్ణాన‌ది పైనే ఆదార‌ప‌డి ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో కృష్ణాన‌దికి పూర్వ‌వైభ‌వం తేవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ న‌గ‌రానికి దాదాపు 200 కిలోమీట‌ర్ల‌కు పైగా దూరం నుండి గోదావ‌రి జ‌లాల‌ను న‌గ‌ర అవ‌స‌రాలకు త‌ర‌లిస్తున్నామ‌న...

కొత్త హీరో హీరోయిన్లను కనిపెట్టే సెల్యులాయిడ్ సైన్స్సిస్ట్ వై వి యస్ చౌదరి

Image
కొత్త హీరో హీరోయిన్లను కనిపెట్టే సెల్యులాయిడ్ సైన్స్సిస్ట్ వై వి యస్ చౌదరి   యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి స్క్రీన్ నేమ్ వై వి యస్ చౌదరి, మే 23 న పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్  సింహావలోకనం చేసుకుంటే... విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు  నందమూరి తారక రామరావు వీర అభిమాని అయినా అతను ఆ మహానటుడి తేజోరూపం పట్ల  ఆకర్షితుడై తెలుగు సినీ రంగం లోకి ప్రవేశించి ఓ గొప్ప  దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా, పంపిణీదారుడిగా మరియు ప్రదర్శన దారుడిగా ఈనాడు టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నిలపెట్టుకున్నాడు వై వి యస్ చౌదరి. తన అభిమాన నటుడు యన్టీర్ ను మాస్ హీరోగా ఎలివేట్ చేసిన కె.రాఘవేంద్ర రావు వద్ద  శిష్యరికం చేసాడు.  తన గురువు లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్ర రావు, వై వి యస్ చౌదరి పుట్టిన తేదీ మే 23 ఒకే రోజు కావటం ఒక విశేషమైతే, పాటల చిత్రీకరణ లో, హీరోయిన్లను గ్లామర్ గా  చూపించడం లో ఇద్దరికి సామీప్యత ఉండడం గమనార్హం. ఇంకా రామ్ గోపాల్ వర్మ, హిందీ దర్శకుడు మహేష్ బట్ మరియు కృష్ణ వంశీ ల వంటి దర్శకుల తో  పనిచేసిన  అనుభవంతో, 1998...

*తెలంగాణ ఎక్స‌లెన్సీ అవార్డును అందుకున్న బ‌ల్దియా క‌మిష‌న‌ర్‌*

Image
Turn off for: Telugu *తెలంగాణ ఎక్స‌లెన్సీ అవార్డును అందుకున్న బ‌ల్దియా క‌మిష‌న‌ర్‌*    రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క తెలంగాణ ఎక్స‌లెన్సీ పురస్కారాన్ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డికి నేడు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి, ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.రామారావులు అంద‌జేశారు. ఎం.సి.ఆర్‌.హెచ్‌.ఆర్‌.డిలో నేడు ఉద‌యం జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఈ అవార్డులు ప‌లువురు ఆల్ ఇండియా సివిల్ స‌ర్వీసెస్ అధికారుల‌కు అంద‌జేశారు. చీఫ్ సెక్ర‌ట‌రీ ఎస్‌.కె.జోషి, ఎం.సి.ఆర్‌.హెచ్‌.ఆర్‌.డి డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ బి.పి.ఆచార్య‌, స్పెష‌ల్ సీఎస్ సురేష్ చంద్ర‌లతో పాటు ప‌లువురు రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారులు, ప్ర‌స్తుత  సీనియ‌ర్ ఐ.ఏ.ఎస్ అధికారులు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డికి అవార్డు ప్ర‌ధానం జరిగింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అత్యంత సంక్లిష్ట‌మైన భూసేక‌ర‌ణ‌ను చేప‌ట్టినందుకుగాను గుర్తింపుగా ఈ తెలంగాణ ఎక్స‌లెన్సీ అవార్డును ప్ర‌ధానం చేశారు. జీహెచ్ఎంసీ ...

జర్నలిస్ట్ ల సంక్షేమమే ధ్యేయం -టీయూడబ్ల్యూజే

జర్నలిస్ట్ ల సంక్షేమమే ధ్యేయం -టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రతినిధుల సభకు అనూహ్య స్పందన.. రాష్ట్రం నలుమూలల నుండి భారీగా తరలి వచ్చిన జర్నలిస్టులు.. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర...

వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించింది

Image
·          పండగ వాతావరణంలో రైతు బంధు పాస్ పుస్తకాలు , చెక్కుల పంపిణీ ·          బిజెపి , కాంగ్రెస్ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ఇలాంటి ఒక్క పథకం ఉందా ·          టిఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ , బిజెపిలకు లేదు ·          అధికారం ఉన్నపుడు అక్రమాలు , అవినీతికి పాల్పడిన దద్దమ్మలు , సన్నాసులు కాంగ్రెస్ నేతలు ·          ప్రజల సొమ్మును నిసిగ్గుగా తిని జైళ్ల వెంట తిరుగుతున్నారు ·          ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్తర కుమార ప్రగల్భాలు..ఆయన చెప్పేవాటికి పార్టీ విధానం లేదు ·          రైతు బంధు విజయవంతం చేసిన రైతులు , అధికారులు , మీడియా , ఇతరులందరికీ కృతజ్ణతలు ·          రైతుబంధుపై విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి...

కార్మికురాలి యోగాక్షేమాలు అడిగిన బ‌ల్దియా క‌మిష‌న‌ర్‌

Image
Turn off for: Telugu *అండాల‌మ్మా.....బాగున్నావా...! !* *కార్మికురాలి యోగాక్షేమాలు అడిగిన బ‌ల్దియా క‌మిష‌న‌ర్‌*  న‌గ‌రంలోని స‌చివాల‌యం స‌మీపంలోని అనుమోల్ హోట‌ల్ వ‌ద్ద పారిశుధ్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న కార్మికురాలి వ‌ద్ద ఒక్క‌సారిగా ఇన్నోవా వాహ‌నం ఆగింది. దానిలో నుండి దిగిన ఇద్ద‌రు అధికారులు కార్మికురాలి పేరు, వివ‌రాలు, ఆమెకు ప్ర‌తినెలా వేతనం స‌కాలంలో అందుతుందా, జీవిత బీమా సౌక‌ర్యం, ఆరోగ్య ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌ను అడిగి తెలుసుకున్నారు. దీంతో త‌న పేరు అండాల‌మ్మ అని త‌న‌కు ప్ర‌తినెల వేత‌నం స‌క్ర‌మంగానే అందుతుంద‌ని, ప్ర‌తిరోజు తాను బ‌యోమెట్రిక్ హాజ‌రు ఇస్తున్నానని, త‌మ‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నార‌ని ఆమె వారికి తెలిపారు. ఇంత‌కు తాము ఎవ‌ర‌మో తెలుసా అని అడ‌గ‌గా తెలియ‌ద‌ని అండాల‌మ్మ స‌మాదానం ఇచ్చింది. తాను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ అని త‌నతో పాటు శానిటేష‌న్ విభాగం అద‌న‌పు క‌మిష‌న‌ర్ శృతిఓజా అని డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి అండాల‌మ్మ‌కు తెలియ‌జేశారు. దీనితో ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి గురైన అండాల‌మ్మ త‌న‌తో క‌మిష‌న‌ర్, అడి...

*జీహెచ్ఎంసీలో ఎస్‌.ఎఫ్‌.ఏల‌కు రూ. 500 అల‌వెన్స్ పెంపు*

Image
*జీహెచ్ఎంసీలో ఎస్‌.ఎఫ్‌.ఏల‌కు రూ. 500 అల‌వెన్స్ పెంపు* *పార‌ద‌ర్శ‌కంగా ఎస్‌.ఎఫ్‌.ఏల అంత‌ర్గ‌త‌ బ‌దిలీలు*   జీహెచ్ఎంసీలో ప‌నిచేస్తున్న పారిశుధ్య  క్షేత్ర స‌హాయ‌కుల(ఎస్‌.ఎఫ్‌.ఏ) అల‌వెన్స్‌ను రూ. 1000 నుండి రూ. 1,500ల‌కు పెచండంతో పాటు వారిని ఇత‌ర స‌ర్కిళ్లకు బ‌దిలీ చేస్తూ జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి నేడు ఉత్త‌ర్వులు జారీచేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో పారిశుధ్య కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క పాత్ర వ‌హించే ఎస్‌.ఎఫ్‌.ఏలు త‌మ‌ అల‌వెన్స్‌ను పెంచాల‌నే సుదీర్ఘ‌కాలంగా ఉన్న డిమాండ్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని మ‌రో రూ. 500ల‌ను పెంచుతున్న‌ట్టు క‌మిష‌న‌ర్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీలో 948 మంది ఎస్‌.ఎఫ్‌.ఏలు ఉండ‌గా వీరిలో 936మంది ఔట్‌సోర్సింగ్ ప‌ద్ద‌తిన‌ విధులు నిర్వర్తిస్తున్నారు. సుదీర్ఘ‌కాలంగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వీరిని బ‌దిలీచేయాల‌ని కార్పొరేట‌ర్లు, శాస‌న స‌భ్యులతో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు అనేక‌మార్లు కోర‌డం జ‌రిగింది. వీరి బ‌దిలీపై జీహెచ్ఎంసీ స‌ర్వ‌సభ్య స‌మావేశంలో కూడా ప‌లుమార్లు ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. గ‌తంలో ఎస్‌.ఎఫ్‌.ఏల బ‌దిలీల‌ను చేప...

పురోగ‌తిలో కేంద్ర ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ పోర్టల్ లో పెండింగ్ ప‌నులు

Image
పురోగ‌తిలో కేంద్ర ప్రాజెక్టు మానిటరింగ్  గ్రూప్ పోర్టల్ లో  పెండింగ్ ప‌నులు కేంద్ర ప్రాజెక్టు మానిటరింగ్  గ్రూప్ పోర్టల్ లో  పెండింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  డా.ఎస్.కె.జోషి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో సి.యస్ అధ్యక్షతన  11 వ Project Monitoring Group  సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి కార్యాలయ స్పెషల్ సెక్రటరి శ్రీ అరుణ్ గోయల్, జాయింట్ సెక్రటరి శ్రీ సోమదత్ శర్మ, R&B ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీ శ్రీధర్, మెట్రోరైల్ ఎండి శ్రీ NVS రెడ్డి, పరిశ్రమల శాఖ కమీషనర్ శ్రీ నదీమ్ అహ్మద్,  అడిషనల్ పిసిసిఎప్ శ్రీమతి శోభ, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, హైదరాబాద్ మెట్రోరైల్, సింగరేణికి సంబంధించి పనులను సమీక్షిస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర అధికారులు పేర్కొన...