మాండలిక భాషలోనే వాస్తవిక కథలు రావాలి... Session - 2
పిల్లలకు నిత్య జీవిత వాస్తవాలను పరిచయం చేయాలి..... హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో జరిగిన "Different Childhoods, Different Tales" చర్చ కార్యక్రమంలో వక్తల పిలుపు తూఫాన్(హైదరాబాద్) :- 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో భాగంగా అనిశెట్టి రజిత వేదిక పై ఆదివారం సాయంత్రం... రెండవ సెషన్ లో భాగంగా Different Childhoods, Different Tales చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డా.అస్మా రషీద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. డా.షెఫాలీ ఝా, డా.గోగు శ్యామల, కనీజ్ ఫాతిమా, డాక్టర్ మధు మిత సిన్హా, డా.ఉమా భృగుబండ మాట్లాడారు.కార్యక్రమానికి అస్మా ఫాతిమా moderator గా వ్యవహరించారు. షెఫాలీ ఝా ప్రసంగిస్తూ, బాల్య స్మృతులే మనిషి వ్యక్తిత్వానికి పునాది వేస్తాయని, పుస్తక జ్ఞానాన్ని సామాజిక సేవతో ముడిపెట్టినప్పుడే జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని పేర్కొన్నారు. తన చిన్నతనంలో దర్గా ఆవరణలోని చింత చెట్టు కింద ఆడుకుంటూనే, అక్కడి మసీదు వెనుక ఒంటరిగా నివసించే ఓ వృద్ధురాలికి (ఖాలా) సహాయం చేసిన తీరును గుర్తుచేసుకుంటూ.. ఆనాటి సామాజిక అనుభవాలే తనలో మానవత్వాన్ని పెంపొందించాయని వివరించారు. ‘స్వేచ్ఛ’ వంటి నవలలు గుర్తింపునిస్తే,...