Posts

మాండలిక భాషలోనే వాస్తవిక కథలు రావాలి... Session - 2

Image
పిల్లలకు నిత్య జీవిత వాస్తవాలను పరిచయం చేయాలి..... హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో జరిగిన  "Different Childhoods, Different Tales" చర్చ కార్యక్రమంలో వక్తల పిలుపు తూఫాన్(హైదరాబాద్) :- 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో భాగంగా అనిశెట్టి రజిత వేదిక పై ఆదివారం సాయంత్రం... రెండవ సెషన్ లో భాగంగా Different Childhoods, Different Tales చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి  డా.అస్మా రషీద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. డా.షెఫాలీ ఝా, డా.గోగు శ్యామల, కనీజ్ ఫాతిమా, డాక్టర్ మధు మిత సిన్హా, డా.ఉమా భృగుబండ మాట్లాడారు.కార్యక్రమానికి అస్మా ఫాతిమా moderator గా వ్యవహరించారు. షెఫాలీ ఝా ప్రసంగిస్తూ, బాల్య స్మృతులే మనిషి వ్యక్తిత్వానికి పునాది వేస్తాయని, పుస్తక జ్ఞానాన్ని సామాజిక సేవతో ముడిపెట్టినప్పుడే జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని పేర్కొన్నారు. తన చిన్నతనంలో దర్గా ఆవరణలోని చింత చెట్టు కింద ఆడుకుంటూనే, అక్కడి మసీదు వెనుక ఒంటరిగా నివసించే ఓ వృద్ధురాలికి (ఖాలా) సహాయం చేసిన తీరును గుర్తుచేసుకుంటూ.. ఆనాటి సామాజిక అనుభవాలే తనలో మానవత్వాన్ని పెంపొందించాయని వివరించారు. ‘స్వేచ్ఛ’ వంటి నవలలు గుర్తింపునిస్తే,...

భారత భద్రత.. రాజీలేని పోరాటం....

Image
 'ఆపరేషన్ సింధూర్' మన దృఢ సంకల్పానికి నిదర్శనం: ప్రధాని మోదీ కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో "మన్ కీ బాత్" వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులూ... తూఫాన్(హైదరాబాద్) :- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన్ కీ బాత్' 129వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని, పార్టీ శ్రేణులు, స్థానిక పారిశుధ్య కార్మికులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా 2025 ఏడాదిని భారతావనికి జాతీయ గర్వకారణమైన సంవత్సరంగా ప్రధాని అభివర్ణించారు. దేశ భద్రత, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట దేశ రక్షణలో భారత్ రాజీలేని పోరాట పటిమను ప్రదర్శిస్తోందని, 'ఆపరేషన్ సింధూర్' ద్వారా మన జాతీయ భద్రతా దృఢత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పామని ప్రధాని పేర్కొన్నారు. వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి దేశభక్తిని మరోసారి ప్రధాని స్మరించుకున్నారు. అలాగే 'తమిళం నేర్చుకుందాం - తమిళ కరకలం' చొరవ ద్వారా భాషా వైవిధ్యం, సాంస్కృతిక ఐక్యతను పెంపొ...

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

Image
  38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ‘పుస్తక స్ఫూర్తి’పై మేధోమథనం వచ్చే ఐదేళ్లలో అప్పులు లేని సమాజమే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు తూఫాన్(హైదరాబాద్) :- అక్షరం మనిషిని ఆలోచింపజేస్తుందని, పుస్తకం జీవితానికి కొత్త దిశను చూపే దారిదీపమని పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ‘అనిశెట్టి రజిత’ వేదికపై ‘పుస్తక స్ఫూర్తి - పుస్తకం ఒక దారిదీపం’ అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని వక్తలను సన్మానించారు. కోటి రూపాయలతో పుస్తకాల పంపిణీ: మంత్రి జూపల్లి ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో పఠనాసక్తిని పెంచేందుకు తమ శాఖ తరపున  కోటి రూపాయల  వ్యయంతో స్ఫూర్తిదాయక పుస్తకాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్...

డెస్క్ జర్నలిస్టులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం

Image
బస్ పాస్ లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాలు వారికి వర్తింపజేయిస్తాం అవాస్తవాలతో కొందరు తప్పుద్రోవ పట్టిస్తున్నారు -టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ  తూఫాన్(హైదరాబాద్) :-   జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్ పాస్ లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి  స్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టులను ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడడం లేదని, వారికి కూడా బస్ పాస్ లతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని తప్పకుండా వర్తింప చేయిస్తామని అన్నారు. ఆదివారం బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ముఖ్యుల సమావేశానంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్...

మనసుకు శాంతిని, సమాజానికి మేధావిని ఇచ్చేది పుస్తకమే....

Image
 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తూఫాన్(హైదరాబాద్):- పుస్తక పఠనం అభ్యాసమైతే అది మనిషికి మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, గొప్ప మేధావిగా తీర్చిదిద్దుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో నిర్వహించిన ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. విద్యార్థులు ప్రతి స్టాల్‌ను సందర్శించి తమకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకోవాలని సూచించారు. పఠనం అనేది కేవలం సమాచారం కోసమే కాకుండా, మెదడుకు పదును పెట్టి విజ్ఞానాన్ని, ఆనందాన్ని పంచుతుందని చెప్పారు. తన జీవిత ప్రయాణంలో ‘నెపోలియన్ ది గ్రేట్’ పుస్తకం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఆయన నిఘంటువులో ‘అసాధ్యం’ అనే పదమే లేదన్న స్ఫూర్తితోనే తాను సమాజ సేవలో నిమగ్నమయ్యానని దత్తాత్రేయ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్నప్పుడు భగవద్గీత తనకు జీవిత పరమార్థాన్ని బోధించిందని, కోవిడ్ వంటి విపత్కర కాలంలో మహాభాగవతం చదవడం వల్ల మానసిక ధైర్యం, శక్తి లభించాయని గుర్తుచేసుకున్నారు. నేటికీ తాను రాత్రి వేళల్లో పఠనానికి సమయం కేటాయిస్తానని చెబుతూ.. మనం ఎంత ఎక్కువగా చదివితే అంత వినమ్రత పె...

December 28th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అంబర్‌పేటలో ఘనంగా వీర్ బాల్ దివస్....

Image
 సిక్కు గురువుల త్యాగాలను స్మరించుకున్న నేతలు 6 నంబర్ చౌరస్తా నుంచి అలీ కేఫ్ వరకు భారీ ప్రదర్శన తూఫాన్(హైదరాబాద్):- సిక్కు మత పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్‌ల వీరోచిత త్యాగాలను స్మరిస్తూ అంబర్‌పేటలో గురువారం రాత్రి 'వీర్ బాల్ దివస్' వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక 6 నంబర్ చౌరస్తా నుండి అలీ కేఫ్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో నాయకులు, సిక్కు సామాజిక వర్గ ప్రతినిధులు మషాల్ (కాగడాలు), కొవ్వొత్తులతో భారీ ర్యాలీ చేపట్టారు. అమరవీరుల స్మరణలో రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు, నాయకులు దీపక్ రెడ్డి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే మతం కోసం, ధర్మ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సాహిబ్‌జాదాల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. వారి ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కదిలివచ్చిన శ్రేణులు.. భక్తిశ్రద్ధలతో ర్యాలీ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓఎస్ రెడ్డి, అజయ్ కుమార్, నేతలు కర్ణె రమేష్ యాదవ...