*అంత‌ర్జాతీయ అవార్డును స్వీక‌రించిన మాచ‌ర్ల కుమార‌స్వామినేత‌*

Turn off for: Telugu


*అంత‌ర్జాతీయ అవార్డును స్వీక‌రించిన మాచ‌ర్ల కుమార‌స్వామినేత‌*

 మ‌లేషియా దేశం కౌలాలాంపూర్ దేశ రాజ‌ధాని సిటీలో ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఎన్‌.ఆర్‌.ఐ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ మ‌లేషియా వారి ఆధ్వ‌ర్యంలో  ఈ నెల 13వ తేదీన కాస్‌మాస్ స్టార్ హోట‌ల్ కౌలాలాంపూర్‌లో మాచ‌ర్ల కుమార‌స్వామి నేత వైస్ ప్రెసిడెంట్‌, తెలంగాణ జ‌ర్న‌లిస్టు యూనియ‌న్ హైద‌రాబాద్‌, స్టాఫ్ రిపోర్ట‌ర్, మెట్రో ఈవినింగ్ తెలుగు దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్నారు. జ‌ర్న‌లిజం విభాగంలో మాచ‌ర్ల కుమార‌స్వామినేత‌కు *అంత‌ర్జాతీయ ఉగాది కీర్తి ర‌త్న‌* అవార్డును స్వీక‌రించ‌ట‌ము జ‌రిగింది. ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రి స‌మ‌క్షంలో మ‌లేషియా తెలుగు సంఘం, ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఎన్.ఆర్‌.ఐ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్‌ ప్ర‌తినిధులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. మాచ‌ర్ల కుమార‌స్వామినేత అంత‌ర్జాతీయ అవార్డును స్వీక‌రించిన త‌ర్వాత మాట్లాడుతూ ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రిని ఒక‌తాటిపై తీసుకు వ‌స్తున్న  ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఎన్‌.ఆర్‌.ఐ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ వాళ్ల‌ను అభినందించారు. ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రి స‌హాయ‌స‌హ‌కార‌ముల‌తో సామాజిక తెలంగాణ సాధించాల‌ని పేర్కొన్నారు. ఈ అంత‌ర్జాతీయ అవార్డును స్వీక‌రించినందుకు కుటుంబ స‌భ్యులు, బందు మిత్రులు, మెట్రో ఈవీనింగ్ మేనేజ్‌మెంట్, స్టాఫ్ హ‌ర్షం వ్య‌క్తం చేసినారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి