పెద్దమ్మతల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు
పెద్దమ్మతల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు
జూబ్లీహిల్స్లోని ప్రసిద్ధ పెద్దమ్మతల్లి ఆలయంలో (Jubilee Hills Peddamma Temple) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) (KTR - Working President KTR) దంపతులు మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన కేటీఆర్ దంపతులు, పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆలయ అర్చకులు కేటీఆర్ దంపతులను ఆశీర్వదించి, వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments
Post a Comment