Posts

Showing posts from April, 2018

జీహెచ్ఎంసీ ఎర్లీబ‌ర్డ్‌కు రూ. 8.70కోట్ల చెల్లింపులు

Image
*ఎర్లీబ‌ర్డ్‌కు రూ. 8.70కోట్ల చెల్లింపులు* *గ‌త మూడు రోజులుగా రూ. 26.34కోట్లు చెల్లించిన 41,090మంది* ఎర్లీబ‌ర్డ్ ప‌థ‌కం కింద ప్ర‌స్తుత‌ 2018-19  సంవ‌త్స‌ర ఆస్తిప‌న్ను చెల్లింపుదారుల‌తో జీహెచ్ఎంసీకి చెందిన సిటీజ‌న్ స‌ర్వీస్ కేంద్రాలు కిట‌కిట‌లాడాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ఆస్తిప‌న్నును చెల్లించేవారికి ఐదు శాతం ప‌న్ను రాయితి ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన మొద‌టి రోజు ఎర్లీబ‌ర్డ్ ఆఫ‌ర్‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నేడు సోమ‌వారం నాడు 14,641 మంది త‌మ ఇంటి ప‌న్ను రూ.  8.70కోట్లు చెల్లించారు. వీటిలో 6,367 మంది ఆన్‌లైన్ ద్వారా రూ. 3.75కోట్లు చెల్లించ‌గా సిటీజ‌న్స్ స‌ర్వీస్ సెంట‌ర్ల ద్వారా 7,024మంది రూ. 4.20కోట్లు చెల్లించారు. ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభ‌మైన‌ ఎర్లీబ‌ర్డ్ ఆఫ‌ర్ ప‌థ‌కంలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 41,090మంది రూ. 26.34కోట్ల‌ను జీహెచ్ఎంసీకి చెల్లించారు.  2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను ఆస్తిప‌న్నును ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించిన‌ట్టైతే ప‌న్ను మొత్తంపై 5శాతం రాయితిని అందిస్తున్నందున ఈ అవ‌కాశాన్ని న‌గ‌ర ప్ర‌జ‌లు పూర్తిస్థాయిలో ఉప‌యోగించుకోవాల‌ని జీహెచ్ఎంసీ క...

కామన్వెల్త్ లో తెలంగాణా షట్లర్ ల సందడి

Image
కామన్వెల్త్ లో తెలంగాణా షట్లర్ ల సందడి హైదరాబాద్ , ఏప్రిల్ 6 : ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల పోటీలలో భాగంగా     తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ , బ్యాడ్మింటన్   క్రీడాకారులు P V సింధు , కిదాంబి శ్రీకాంత్ లను   Carrara stadium లో కలసి అభినందనలు తెలిపిన   తెలంగాణా క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ , రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ   కార్యదర్శి బుర్రా వెంకటేశం , రాష్ట్ర క్రీడల ప్రాధికారత సంస్థ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి , క్రీడా శాఖ మంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ SM రాజేశ్వర్ రావు. కామన్వెల్త్ క్రీడల   పోటీలలో బ్యాడ్మింటన్ విభాగంలో మంచి ప్రదర్శన చేసి ఎక్కువ పథకాలు సాధించాలని మంత్రి పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు.

వైద్య ఆరోగ్య సంస్క‌ర‌ణ‌లు దేశానికే త‌ల‌మానికం - మంత్రి కేటీఆర్

Image
వైద్య ఆరోగ్య సంస్క‌ర‌ణ‌లు దేశానికే త‌ల‌మానికం - మంత్రి కేటీఆర్ *తెలంగాణ ఆరోగ్య‌శాఖ‌లో గుణాత్మ‌క ప్ర‌గ‌తి* *త్వ‌ర‌లో రాష్ట్రంలో ప్ర‌తి వ్య‌క్తికీ హెల్త్ ప్రొఫైల్‌* *ఇంటింటికీ కంటి, రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు* *గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వెయ్యి బ‌స్తీ ద‌వాఖానాలు*    తెలంగాణ‌లో చేప‌ట్టిన వైద్య ఆరోగ్య సంస్క‌ర‌ణ‌లు దేశానికే త‌ల‌మానిక‌మ‌న్నారు ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు. కెసిఆర్ మార్గ నిర్దేశ‌నంలో, మంత్రి ల‌క్ష్మారెడ్డి చొర‌వ‌తో రాష్ట్ర ఆరోగ్య‌శాఖ గుణాత్మ‌క మార్పులు తీసుక‌వ‌చ్చింద‌న్నారు. నేను రాను బిడ్డో అని పాడుకునే రోజుల నుంచి నేను వ‌స్త బిడ్డో స‌ర్కార్ ద‌వాఖానాకు అనే స్థాయిలో ప్ర‌భుత్వ ద‌వాఖానాల వైపు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షితుల‌ను చేయ‌డం సామాన్య విష‌యం కాద‌న్నారు. మ‌ల్కాజీగిరి బి.జె.ఆర్ న‌గర్‌లో వైద్య ఆరోగ్య‌శాఖ‌-గ్రేట‌ర్ హైదారాబాద్ కార్పొరేష‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ‌స్తీ దావ‌ఖానాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.ల‌క్ష్మారెడ్డి, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ల‌తో క‌లిసి కెటిఆర్  ప్రారంభించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ...

త్వరలో హైదారాబాదు నగరానికి ఎడీబీ ప్రతినిధి బృందం

Image
*న్యూఢిల్లీ లో ఎడీబీ అధికారులతో మేయర్, ముఖ్య కార్యదర్శుల భేటీ త్వరలో నగరానికి ఎడీబీ ప్రతినిధి  బృందం*     గ్రేటర్ హైదారాబాదులో మౌలిక స‌దుపాయాల‌ కల్పన కు ఆర్డిక సహాయాన్ని అందించాలని కోరుతూ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వం లో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారుల బృందం న్యూ డిల్లీ లో నేడు ఆసియా అభివృద్ది బ్యాంక్ ఉన్నాతాదికారులను కలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రం లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో ప్రధానంగా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, టీ- ఫైబర్, డబుల్ బెడ్‌రూం ఇళ్ల‌ నిర్మాణం, ఎస్ఆర్డీపీ తదితర కార్యక్రమాలు ఉన్నాయని ఏడీబీ అడికారులకు వివరించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె టీ ఆర్ ఆదేశాల మేరకు న్యూ డిల్లీ  లొని ఆసియా అభివృద్ది బ్యాంకు అధికారులను మేయర్ రామ్మోహన్ తో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యడర్శి అరవింద్ కుమార్, పరిశ్రమలు, ఐటీ శాఖ ముక్య కార్యదర్శి జయెశ్ రంజన్ లు సమావేశ మయ్యారు. ఎడీబీ న్యూ డిల్లీ మిషన్ డైరెక్టర్ యొకొయమా తో సమాయెశమై  తెలంగాణా లో ముక్యంగా గ్రేటర్ ...

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌

Image
త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌ సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేశ్‌ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం ' సత్య గ్యాంగ్‌స‌. ఈ సినిమా ఏప్రిల్ 6న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ - ``సాధార‌ణంగా పుట్టుక‌తో అనాథ‌లుగా ఉండే వారికి, పుట్టిన త‌ర్వాత అనాథ‌లుగా మారే వారికి ఈ సోసైటీలో గుర్తింపు ఉండ‌దు. అటువంటి వారిని ప‌ట్టించుకోక‌పోతే వారు నేర‌స్థులుగా మారే అవ‌కాశం ఉంది. స‌త్యగ్యాంగ్‌` చిత్రం అనాథ‌ల‌కు సంబంధించిన క‌థ‌తో సాగే చిత్రం. ఇందులో నేను అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ పాత్ర‌లో న‌టించాను. మాన‌వ అవ‌యవాల‌ను దొంగిలించి రవాణా చేసే ఓ ముఠా.. వారిని ప‌ట్టుకునుందుకు పోలీసులుగా మేమేం చేశామ‌నేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. క‌ర్నూలుకు చెందిన మ‌హేశ్ ఖ‌న్నాగారు నిర్మాత‌గానే కాకుండా ఇందులో మంచి పాత్ర‌లో కూడా న‌టించారు. అలాగే సుహ...

నెలాఖ‌రులోగా గేటెడ్ కాల‌నీల్లో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయాలి - క‌మిష‌న‌ర్

Image
*నెలాఖ‌రులోగా గేటెడ్ కాల‌నీల్లో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయాలి - క‌మిష‌న‌ర్*   న‌గ‌రంలోని గేటెడ్ క‌మ్యునిటి కాల‌నీల్లో ఈ నెలాఖ‌రు వ‌ర‌కు సేంద్రియ ఎరువుల త‌యారీ గుంత‌ల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు అన్ని ఇళ్ల‌లోనూ స్వ‌యంగా కంపోస్ట్ ఎరువుల త‌యారీని ప్రారంభించేలా చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జనార్థ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, ట్రాన్స్‌పోర్ట్స్ ఇంజ‌నీర్ల‌తో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు శృతిఓజా, ర‌వికిర‌ణ్‌, భాస్క‌రాచారి, విజిలెన్స్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్‌కంపాటిలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ...ప్ర‌తి ఇంటి నుండి త‌డి, పొడి చెత్త‌ను వేర్వేరుగా సేక‌రించ‌డానికి ప్రాధాన్య‌త ఇస్తూనే ఇంట్లోనే ప్ర‌త్యేకంగా కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. ముఖ్యంగా గేటెడ్ క‌మ్యునిటి కాలనీల ల‌క్ష్యంగా కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటును వంద శాతం చేప‌ట్టాల‌ని మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌ను ఆదేశించారు. త‌డి, పొడి చెత్త‌ను వేరుచేసేవారికి లాట‌రీ ద్వారా ల‌క్ష రూపాయ‌లు అంది...

`రంగ‌స్థ‌లం` న‌టుడిగా బాధ్యత‌ను పెంచింది: న‌టుడు ఆది పినిశెట్టి

Image
 `రంగ‌స్థ‌లం` న‌టుడిగా బాధ్యత‌ను పెంచింది: న‌టుడు ఆది పినిశెట్టి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `రంగ‌స్థ‌లం` ఇటీవ‌ల విడుదలై భారీ విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్ లో  చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసి స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కాభిమానులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సంగ‌తి తెలిసిందే.  ఇందులో  చిట్టిబాబు (రామ్ చ‌ర‌ణ్)  అన్న‌య్య పాత్ర‌లో న‌టించిన కుమార్ బాబు ( ఆది పినిశెట్టి) త‌న బిజీ షెడ్యూల్ కార‌ణంగా  వేడుక‌కు హాజ‌రుకాలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియా ముందుకొచ్చి `రంగ‌స్థ‌లం` అనుభూతుల‌ను మీడియాతో పంచుకున్నారు. ఆ వేంటో ఆయ‌న మాట‌ల్లోనే... `ఓ  సినిమా ఫోటో షూట్ కార‌ణంగా నిన్న జ‌రిగిన `రంగ‌స్థ‌లం` థాంక్స్ మీట్ కు హాజ‌రుకాలేక‌పోయాను. ఆ హ్యాపీ మూవ్ మేంట్ ను మీతో,  యూనిట్ తో పంచుకోలేక‌పోయాను. అందుకు  బాధ‌గా కూడా ఉంది. `రంగ‌స్థ‌లం`  పెద్ద విజ‌యం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ నేను న‌టించిన ప్ర‌తీ పాత్ర‌ను ప్రేక్ష‌కులు...మీడియాతో ఎంతో స‌పోర...

గ్రేట‌ర్‌లో 72 పార్కుల సుంద‌రీక‌ర‌ణ‌ పూర్తి ... మొత్తం ల‌క్ష్యం 100 ఉద్యాన వ‌నాలు

Image
గ్రేట‌ర్‌లో  72 పార్కుల సుంద‌రీక‌ర‌ణ‌ పూర్తి ... మొత్తం ల‌క్ష్యం 100  ఉద్యాన వ‌నాలు  గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు మ‌రింత మెరుగైన‌ జీవ‌న విధానం, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికిగాను కొత్త‌గా వంద ఉద్యాన వ‌నాల ఏర్పాటు చేయాల‌ని జీహెచ్‌ఎంసీ నిర్ణ‌యించ‌గా మ‌రో నెల‌రోజుల్లో వంద పార్కుల నిర్మాణం పూర్తిఅవ‌నున్నాయి. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 5.40కోట్ల వ్య‌యంతో 100నూత‌న పార్కుల‌ను వివిధ కాల‌నీలు, బ‌స్తీల్లో ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేసింది. దీనిలో భాగంగా నేటి వ‌ర‌కు 72పార్కులు పూర్తై న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి రాగా మిగిలిన 28పార్కుల నిర్మాణాన్ని ఏప్రిల్ 30వ తేదీలోగా పూర్తిచేయాల‌ని జీహెచ్ఎంసీ కమిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఆదేశించ‌డంతో నిర్థారిత స‌మయంలో ఈ పార్కుల‌ను పూర్తి చేయ‌డానికి అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ విభాగం ముమ్మరంగా ప‌నుల‌ను నిర్వహిస్తోంది. ఈ వంద పార్కుల్లో అధిక శాతం కాల‌నీల‌లో నిర్మిస్తుండ‌డంతో పాటు నిర్మాణంలో సంబంధిత కాల‌నీ సంక్షేమ సంఘాలు వాటి నిర్మాణ ప‌నుల‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నాయి. పూర్తి అయిన పార్కుల నిర...