యూత్కి, ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే చిత్రం `చి.ల.సౌ` - చైతన్య అక్కినేని

యూత్కి, ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే చిత్రం `చి.ల.సౌ` - చైతన్య అక్కినేని సుశాంత్, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చి||ల||సౌ'. అన్నపూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ క్రియేషన్స్ బ్యానర్స్పై అక్కినేని నాగార్జున, భరత్ కుమార్, జస్వంత్ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... చైతన్య అక్కినేని మాట్లాడుతూ - ''7-8 నెలలు క్రితం సమంతో నాతో.. 'రాహుల్ నిన్ను, నన్ను కలిసి ఓ స్క్రిప్ట్ చెబుతాడట' అంది. నేను రాహుల్ నటించబోయే సినిమా అనుకున్నాను. కానీ తను దర్శకత్వం చేస్తున్నాడని తెలిసి కాస్త సర్ప్రైజ్ అయ్యాను. కథ వినగానే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఓ రాత్రిలో జరిగే కథ ఇది. ఇలాంటి కథ ఆడియెన్స్కు కనెక్ట్ అవుతుందా? అనే సందేహం ఉండేది. సమంత నీది, రాహుల్ది సెన్సిబిలిటీస్ ఒకేలా ఉంటాయి. నువ్వు తనతో ఓ సినిమా చెయ్ అంది. సినిమా చూసిన తర్వాత తనతో సినిమా చేయడం సంగతి పక్కన పెడితే.. ఎలాగైనా ఈ సినిమాలో భాగం అయితే బావుండు అనిపించి నాన్నగారితో చెప్...